News March 21, 2024
BIG BREAKING: విశాఖలో 25వేల కేజీల డ్రగ్స్ పట్టివేత

AP: విశాఖపట్నం తీరంలో CBI భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకుంది. బ్రెజిల్లోని శాంటోస్ పోర్టు నుంచి విశాఖకు వచ్చిన కంటైనర్లో 25వేల కేజీల డ్రగ్స్ను గుర్తించింది. డ్రైఈస్ట్తో మిక్స్ చేసి వెయ్యి బ్యాగుల్లో 25కేజీల చొప్పున ప్యాక్ చేశారు. ఇంటర్పోల్ సమాచారంతో CBI ఆపరేషన్ ‘గరుడ’ పేరుతో ఆపరేషన్ చేపట్టి డ్రగ్స్ పట్టుకుంది. విశాఖలోని ఓ ప్రైవేట్ కంపెనీ అడ్రస్తో డెలివరీ చేసేందుకు యత్నించినట్లు తేల్చింది.
Similar News
News April 3, 2025
HEADLINES

వక్ఫ్ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా
AP: వచ్చే ఐదేళ్లలో 20వేల స్టార్టప్ల స్థాపనే లక్ష్యం: CM CBN
AP: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాం: జగన్
TG: HCU భూములపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
TG: బీసీల డిమాండ్ను బీజేపీ పట్టించుకోవాలి: CM రేవంత్
TG: LRS రాయితీ గడువు పొడిగింపు
TG: భవిష్యత్ తరాల కోసం HYDని నాశనం చేస్తారా?: KTR
News April 3, 2025
ఆరు నెలల్లో రెండు ఎయిర్పోర్టులు సాధించాం: కోమటిరెడ్డి

TG: ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు IAF గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 2 ఎయిర్పోర్టులు(మామునూర్, ఆదిలాబాద్) సాధించడం తమ ప్రభుత్వ కృషికి దక్కిన ఫలితమన్నారు. ఎయిర్పోర్టుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందేలా IAFతో కలిసి తదుపరి కార్యాచరణపై నివేదిక రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్కు ధన్యవాదాలు తెలిపారు.
News April 3, 2025
IPL: ఆర్సీబీ ఓటమి

బెంగళూరులో ఆర్సీబీతో మ్యాచ్లో170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 2 వికెట్ల నష్టానికి సునాయాస విజయాన్ని సాధించింది. సాయి సుదర్శన్(36 బంతుల్లో 49), బట్లర్(39 బంతుల్లో 73) రాణించడంతో 17.5 ఓవర్లలోనే స్కోర్ ఛేదించింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, హేజిల్వుడ్ చెరో వికెట్ తీసుకున్నారు.