News June 13, 2024
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన CM చంద్రబాబు

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన, సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News November 10, 2025
ఆ ఇద్దరిలో ఒకరికి RR పగ్గాలు?

వచ్చే IPL సీజన్లో రాజస్థాన్ రాయల్స్ సారథి <<18248474>>సంజు శాంసన్<<>> జట్టును వీడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ ఎవరనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. దీనికి సమాధానంగా ధ్రువ్ జురెల్, జైస్వాల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. RR కెప్టెన్సీ రేసులో వీళ్లే ముందున్నారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. రియాన్ పరాగ్ పేరు ఈ లిస్ట్లో లేకపోవడం గమనార్హం. ఎవరు RR కెప్టెనైతే బాగుంటుంది? COMMENT
News November 10, 2025
అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన

వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న మహిళా క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ జాగ్రత్తలు చెప్పారు. ‘మీకు ఇస్తామని చెప్పిన అవార్డులు, రివార్డులు అందకుంటే నిరుత్సాహపడకండి. విజేతల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. ఈ సిగ్గులేని వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దీనికి బాధపడొద్దు’ అని సూచించారు. గతంలో 1983 మెన్స్ టీమ్కూ ఇలాంటి హామీలు వచ్చాయని తెలిపారు.
News November 10, 2025
సిద్దరామయ్యకు సమయమివ్వని హైకమాండ్?

కర్ణాటకలో CM మార్పు చర్చ ఇటీవల జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమతో సమావేశం అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇవే ఆదేశాలు ఇతర నేతలకూ వర్తిస్తాయని, అపాయింట్మెంట్లు అడగొద్దని స్పష్టంచేసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో పుస్తకావిష్కరణకు మాత్రమే సిద్దరామయ్య పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.


