News September 1, 2024
BIG BREAKING: వరద బాధితులకు సాయం ప్రకటించిన సీఎం

AP: రాష్ట్రంలో రికార్డుస్థాయి వర్షాలు కురుస్తున్నాయని, నేషనల్ హైవేలు కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చిందని సీఎం చంద్రబాబు చెప్పారు. వరద బాధితులకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున పంచదార, ఆయిల్, ఉల్లి, బంగాళదుంపలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారులకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
Similar News
News November 29, 2025
రోహిత్ శర్మ ముంగిట అరుదైన రికార్డులు

SAతో వన్డే సిరీస్కు ముందు రోహిత్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 3 సిక్సులు బాదితే ODI ఫార్మాట్లో లీడింగ్ సిక్స్ హిట్టర్గా నిలుస్తారు. అలాగే 98 రన్స్ చేస్తే 20వేల అంతర్జాతీయ పరుగులు పూర్తవుతాయి. 213 రన్స్ కొడితే 16వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్గా అవతరిస్తారు. ఓ సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్గా రికార్డ్ సృష్టిస్తారు. SAతో 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
News November 29, 2025
ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

అడ్వాన్స్డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.
News November 29, 2025
కాళోజీ వర్సిటీ ఇష్యూ.. చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం: రేవంత్

TG: కాళోజీ వర్సిటీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలతో పాటు ఇన్ఛార్జుల నియామకంలో ఆరోపణలపై ఆయన ఆరా తీశారు. ఉన్నతాధికారుల నుంచి వివరణ కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలు ఆరోపణలతో కాళోజీ వర్సిటీ వీసీ డా.నందకుమార్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.


