News April 7, 2024
BIG BREAKING: సీఎం జగన్కు ఈసీ నోటీసులు

AP: సీఎం జగన్కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని టీడీపీ చేసిన ఫిర్యాదుతో 48 గంటల్లో వివరణ ఇవ్వాలని జగన్కు సీఈవో మీనా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 3న పూతలపట్టు సిద్ధం సభలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.
Similar News
News January 29, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అర్హులు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://skltghu.ac.in/
News January 29, 2026
అమరావతిలో న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ

AP: రాజధాని అమరావతిలో ది న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్(NIACL) రీజినల్ ఆఫీస్ ఏర్పాటు చేయనుంది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి పరిధిలో రూ.100కోట్లతో ఆఫీస్ నిర్మాణం చేపట్టనుంది. ఈ మేరకు నిన్న CRDA అధికారులతో ఆ కంపెనీ చీఫ్ రీజినల్ మేనేజర్ వి.రాజా ఒప్పందం చేసుకున్నారు. టెక్నికల్, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో 200-225 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
News January 29, 2026
మేడారం జాతరలో మహిళ ప్రసవం

TG: మేడారం వనదేవతల సన్నిధిలో ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. HYD మౌలాలీకి చెందిన నిండు గర్భిణి రజిత జాతరకు వెళ్లారు. ఇవాళ తెల్లవారుజామున ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో మేడారంలోని ప్రధాన ఆస్పత్రికి తరలించారు. DMHO డా.అప్పయ్య పర్యవేక్షణలో వరంగల్ CKM ఆస్పత్రి వైద్యులు రమ్య, నికిత ఆమెకు సుఖప్రసవం చేశారు. రజిత మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు.


