News May 23, 2024
BIG BREAKING: డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.
Similar News
News March 1, 2026
INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

వెస్టిండీస్తో మ్యాచులో భారత పేసర్ అర్ష్దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.
News March 1, 2026
కేసులు పరిష్కరించే మధ్యవర్తులకు రూ.10,000: CBN

AP: అమరావతిలో నేషనల్ జుడీషియల్ అకాడమీని నెలకొల్పాలని CM చంద్రబాబు CJIని కోరారు. ’మధ్యవర్తిత్వం‘పై జరిగిన సదస్సులో మాట్లాడుతూ ‘ఇక్కడ నిర్మించే జస్టిస్ సిటీని దేశంలోనే బెస్ట్ మోడల్గా తీర్చిదిద్దుతాం. మధ్యవర్తిత్వంతో కేసులను పరిష్కరిస్తే ₹10,000 ఇస్తాం. కేసులు పరిష్కారం కాకున్నా ₹3000 ఇస్తాం’ అని పేర్కొన్నారు. అంతకు ముందు జడ్జీల బంగ్లాలను CJI ప్రారంభించారు. AP జుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేశారు.
News March 1, 2026
BREAKING: US యుద్ధనౌకపై 4 మిస్సైళ్లతో ఇరాన్ దాడి

యుద్ధ విమానాలను తరలిస్తున్న అమెరికా నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ దాడి చేసింది. 4 బాలిస్టిక్ మిస్సైళ్లతో అటాక్ చేసినట్లు IRGC ప్రకటించింది. అయితే యుద్ధ విమానాలకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ చుట్టుపక్కల ఉన్న ఎయిర్ బేస్లకు వాటిని తరలిస్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్పై US దాడులు మరింతగా పెంచే ఆస్కారముంది.


