News May 23, 2024
BIG BREAKING: డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.
Similar News
News March 2, 2026
దానం, కడియంలకు స్పీకర్ నోటీసులు

TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు MLAలకు స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు. MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై BRS MLAలు KP వివేకానంద్, పాడి కౌశిక్ రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఇప్పటికే తాము పార్టీ మారలేదని కడియం, దానం స్పీకర్కు రిప్లై ఇచ్చారు. అయితే తగిన ఆధారాలతో విచారణకు రావాలని స్పీకర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 4న వీరిని విచారణ చేయనున్నారు.
News March 2, 2026
అమెరికాతో చర్చల ప్రసక్తే లేదు: ఇరాన్

అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లరిజానీ స్పష్టం చేశారు. చర్చల పునరుద్ధరణకు తమ నుంచి ప్రతిపాదనలు వచ్చాయంటూ వచ్చిన వార్తలను ఖండించారు. ఇజ్రాయెల్ ఆధిపత్య లక్ష్యాల కోసం ట్రంప్ తమ సైనికులను పణంగా పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అగ్రరాజ్యాధిపతి భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.
News March 2, 2026
చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. రంగులు చల్లుకోవచ్చా?

మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడుతున్నందున ఆ రోజు రంగులు చల్లుకోవడం చేయకూడదని జ్యోతిషులు హెచ్చరిస్తున్నారు. గ్రహణ సమయంలో పూజలు, వేడుకలు చేయకూడదంటున్నారు. అయితే ఈ సమయంలో చేసే మంత్ర జపం, అనుష్టానాలకు వేల రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ ప్రభావం ముగిసిన తర్వాత, అంటే మార్చి 4న ఎలాంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగుల హోలీని వైభవంగా జరుపుకోవచ్చని సూచిస్తున్నారు.


