News May 23, 2024

BIG BREAKING: డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్

image

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్‌, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.

Similar News

News February 28, 2026

రూ.2,300 కోట్ల ప్రాజెక్టుకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

image

AP: అనకాపల్లి(D) రాంబిల్లి(M) సీతాపాలెం సెజ్‌లో బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. ₹2,300Cr పెట్టుబడితో చేపడుతున్న ఈ అధునాతన ఫార్మాస్యూటికల్ ఇంటర్మీడియట్స్& CDMO ఫెసిలిటీ ఉత్తరాంధ్ర ఇండస్ట్రీయల్ గ్రోత్‌కు బూస్ట్ ఇస్తుందని పేర్కొన్నారు. దీని ద్వారా 1,750 మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు క్యూ కడుతున్నాయన్నారు.

News February 28, 2026

హార్ముజ్ ఎఫెక్ట్.. క్రూడ్ ఆయిల్ ధర $110?

image

అపార ఆయిల్ క్షేత్రాలున్న మిడిల్ ఈస్ట్‌ నుంచి ఉత్పత్తులను ఆసియా, యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాలకు హార్ముజ్ జలసంధి నుంచే రవాణా చేస్తారు. హార్ముజ్‌పై US దాడి చేస్తుందనే భయంతో కొన్ని షిప్పింగ్ కంపెనీలు ముడి చమురు రవాణాను <<19266223>>నిలిపివేస్తున్నట్లు<<>> ప్రకటించాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $67గా ఉండగా హార్ముజ్ ఎఫెక్ట్‌తో $95 నుంచి $110కి చేరొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయి.

News February 28, 2026

కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

image

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.