News May 23, 2024

BIG BREAKING: డ్రగ్స్ టెస్టులో హేమకు పాజిటివ్

image

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీలో పాల్గొన్న మొత్తం 98 మందికి టెస్టులు చేయగా, 87 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. వారిలో సినీ నటీమణులు హేమ, ఆషీరాయ్‌, పార్టీ నిర్వహించిన వాసు తదితరులు ఉన్నారు. వారందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు పంపనున్నారు.

Similar News

News March 2, 2026

రేపు HYDలో లిక్కర్ షాపులు బంద్

image

హోలీ నేపథ్యంలో హైదరాబాద్‌లో మార్చి 3న లిక్కర్ షాపులను మూసివేయాలని CP సజ్జనార్ ఆదేశించారు. 6AM నుంచి 6PM వరకు లిక్కర్, కల్లు దుకాణాలు, బార్లు మూసేయాలని, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మార్చి 2 నుంచి 4 వరకు ఎవరిపైనా బలవంతంగా రంగులు చల్లవద్దని స్పష్టం చేశారు. వాహనాలపై గుంపులుగా వెళ్తూ న్యూసెన్స్ చేసినా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

News March 2, 2026

TGలో BJP మోడల్ ‘బుల్డోజర్ రాజ్’: కేరళ CM

image

తెలంగాణలోని INC ప్రభుత్వం BJP మోడల్ బుల్డోజర్ రాజ్‌ను నడిపిస్తోందని కేరళ CM పినరయి విజయన్ విమర్శించారు. ఖమ్మంలోని భూదాన్ భూముల్లో నిర్మించుకున్న దాదాపు 700ఇళ్లను GOVT కూల్చివేయడంపై ఆయన Xలో ఫైరయ్యారు. ‘3వేల మంది పేదలను నిరాశ్రయుల్ని చేసి INC తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. పేదలను పీడించే బీజేపీ విధానాలను అనుసరిస్తోంది. పేదలపై చేస్తున్న ఈ దాడికి ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News March 2, 2026

మేం యుద్ధాన్ని స్టార్ట్ చేయలేదు కానీ ముగిస్తాం: US

image

ఇరాన్‌తో యుద్ధాన్ని తాము మొదలు పెట్టలేదని, కానీ ముగించేది మాత్రం తామేనని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సేత్ అన్నారు. ఇరాన్‌పై జరిగిన ఏరియల్ ఆపరేషన్ చరిత్రలో అత్యంత సంక్లిష్టమైన, కచ్చితమైనదని పేర్కొన్నారు. ‘ఇరాన్ వంటి ప్రభుత్వాలు అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అమెరికన్లను చంపే/బెదిరించే ఎవరినైనా వేటాడుతాం. ఇది అంతులేని యుద్ధంగా మారదు. కానీ ఇరాన్‌లో ప్రభుత్వం మారుతుంది’ అని వ్యాఖ్యానించారు.