News December 30, 2024
AP సీఎస్గా విజయానంద్ ఖరారు

AP కొత్త సీఎస్గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎస్ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.
Similar News
News November 21, 2025
ఇండీ కూటమిని బలోపేతం చేస్తాం: కాంగ్రెస్

ప్రతిపక్ష ఇండీ కూటమిని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. బిహార్లో ఘోర ఓటమితో కూటమి మనుగడపై సందేహాలు మొదలైన నేపథ్యంలో క్లారిటీ ఇచ్చింది. ‘INDIA ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమీ మారలేదు. కూటమిని బలోపేతం చేసేందుకు రెట్టింపు ప్రయత్నాలు చేస్తాం. డిసెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే వింటర్ సెషన్లో ప్రతిపక్షాలు సమన్వయంతో ముందుకు సాగుతాయి’ అని AICC ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు.
News November 21, 2025
ఇతిహాసాలు క్విజ్ – 73

ప్రశ్న: యుద్ధంలో ఓడిపోతాం అనే భయంతో దుర్యోధనుడు భీష్ముడి దగ్గరకు వెళ్లి ‘మీరు పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదు’ అని నిందిస్తాడు. అప్పుడు భీష్ముడు 5 బాణాలిచ్చి, వీరితో పంచ పాండవుల ప్రాణాలు తీయవచ్చు అని చెబుతాడు. మరి ఆ బాణాల నుంచి పాండవులు ఎలా తప్పించుకున్నారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం. ☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 21, 2025
అక్టోబర్లో ట్యాక్స్ రెవెన్యూ రూ.16,372 కోట్లు

TG: అక్టోబర్లో రాష్ట్ర ఖజానాకు అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్లు సమకూరినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. ఎక్సైజ్ సుంకాల ద్వారానే రూ.3,675Cr వచ్చినట్లు పేర్కొంది. అక్టోబర్ రెవెన్యూతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఖజానాకు చేరిన మొత్తం రూ.88,209.10Crకు పెరిగింది. FY26లో పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35Cr వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు 50.31% సమకూరింది.


