News June 4, 2024
BIG BREAKING: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు

జనసేనాని అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. పవర్ స్టార్ ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా అమరావతి శాసనసభకు వెళ్లడమే మిగిలింది. తాజాగా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ 50 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Similar News
News January 9, 2026
మాయమైపోతున్నారమ్మా.. హరిదాసులు, డూడూ బసవన్నలు

‘అయ్యవారికి దండంపెట్టు..అమ్మగారికి దండంపెట్టు’ అంటూ సంక్రాంతి సీజన్లో సందడి చేసే గంగిరెద్దుల కళాకారులు అంతరించిపోతున్నారు. ఒకప్పుడు సన్నాయి మేళాలు, అలంకరించిన బసవన్నలు, కుటుంబం, వంశాలను కీర్తిస్తూ పద్యాలు పాడే హరిదాసులు ఇంటింటికీ తిరుగుతూ సందడి చేసేవారు. తగ్గిన ఆదరణ, పెరిగిన ఖర్చులతో భవిష్యత్ తరాల మనుగడ కష్టమవుతుందనే కారణంతో పూర్వీకుల కళను వదిలి బరువెక్కిన హృదయంతో వలసబాట పడుతున్నారు.
News January 9, 2026
BJP కొత్త ఆయుధంగా సెన్సార్ బోర్డు: స్టాలిన్

సెన్సార్ బోర్డుపై తమిళనాడు CM స్టాలిన్ ఫైర్ అయ్యారు. CBI, ED, IT శాఖ మాదిరే ఇప్పుడు సెన్సార్ బోర్డు BJP కొత్త ఆయుధంగా మారిందని ఆరోపించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. శివకార్తికేయన్ నటించిన ‘పరాశక్తి’ మూవీ విషయంలోనే ఆయన స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం 25కట్స్ సూచిస్తూ U/A సర్టిఫికెట్ను CBFC జారీ చేసింది. 1965 యాంటీ హిందీ ఆందోళన ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి DMK సపోర్ట్ ఉంది.
News January 9, 2026
తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

తిరుమల కల్తీ నెయ్యి కేసులో A-34గా ఉన్న TTD డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం నెల్లూరు ACB కోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి క్వాలిటీ లేకున్నా ఆయన లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారని ప్రభుత్వ లాయర్ వాదించారు. భోలేబాబా కంపెనీ నుంచి రూ.75లక్షలు, ప్రీమియర్ నుంచి రూ.8L, అల్ఫా నుంచి 8 గ్రా. గోల్డ్ తీసుకున్నట్లు సిట్ గుర్తించిందన్నారు. దీంతో కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.


