News January 8, 2025
BIG BREAKING: ఇంటర్ పరీక్షల్లో సమూల మార్పులు

AP: ఇంటర్ పరీక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను తొలగిస్తామని బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. బోర్డు కేవలం సెకండియర్ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుందని చెప్పారు. ఈ నెల 26 వరకు విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. 2025-26 నుంచి ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్ ప్రవేశపెడతామని తెలిపారు.
Similar News
News August 22, 2025
పవన్ కళ్యాణ్ సూచన.. CBN అభినందనలు

AP: ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. నాలా చట్టసవరణపై చర్చిస్తుండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచన చేశారు. సాగుభూమిని వ్యవసాయేతరంగా మార్చేటప్పుడు లభించే ఆదాయం పంచాయతీలకు అందేలా చూడాలని, తద్వారా పంచాయతీలు బలోపేతం అవుతాయని చెప్పారు. దీనిపై స్పందించిన చంద్రబాబు మంచి సూచన చేశారని పవన్ను అభినందించారు. పవన్ సూచనలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News August 22, 2025
పాక్ని కాపాడుతాం.. బుద్ధి బయట పెట్టిన చైనా

పాకిస్థాన్కు తమ మద్దతు కొనసాగుతుందని చైనా ప్రకటించింది. ‘పరిశ్రమ, వ్యవసాయ, మైనింగ్ రంగాల్లో మా సపోర్ట్ ఉంటుంది. వారి సార్వభౌమాధికారం, ఉగ్రవాదంపై పోరులో మద్దతిస్తాం. పాక్కు ప్రాధాన్యత ఇవ్వడం కొనసాగుతుంది’ అని చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ తెలిపారు. భారత్తో వాణిజ్యాన్ని ఆహ్వానిస్తూ.. పాక్కు మద్దతిస్తామనడం వెనుక చైనా అసలు బుద్ధి అర్థమవుతోందని విమర్శలు వస్తున్నాయి.
News August 22, 2025
ఆన్లైన్ గేమింగ్ బిల్: Dream 11 బంద్!

కేంద్రం ఆన్లైన్ గేమింగ్ బిల్-2025 తీసుకురావడంతో Dream Sportsకు చెందిన Dream 11 బంద్ కానుంది. తాము అన్ని రకాల రియల్ మనీ గేమింగ్ బిజినెస్లను మూసేస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించినట్లు సమాచారం. ఇక నుంచి తాము FanCode, DreamSetGo, Dream Game Studiosనే నడుపుతామని చెప్పినట్లు తెలుస్తోంది. 2024 ఆర్థిక సం.లో Dream Sports ఆదాయం రూ.9,600 కోట్లు కాగా అందులో 90% Dream 11 నుంచే వచ్చింది.