News June 24, 2024
BIG BREAKING: 65 లక్షల మందికి రూ.7,000 పెన్షన్

AP: జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. దీంతో వృద్ధులు, వితంతువులకు ప్రతినెలా వచ్చే పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది. జులై 1న ఒకేసారి 65 లక్షల మంది ఇంటి వద్దే రూ.7,000 పెన్షన్ అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది.
Similar News
News November 7, 2025
ఇవాళ ‘SSMB29’లో పృథ్వీరాజ్ లుక్ రిలీజ్: రాజమౌళి

సూపర్ స్టార్ మహేశ్బాబుతో తీస్తోన్న SSMB29 చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతున్నట్లు డైరెక్టర్ రాజమౌళి వెల్లడించారు. ఇదే సమయంలో ఈనెల 15న జరగనున్న ‘GlobeTrotter’ ఈవెంట్ కోసమూ భారీగా సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ‘ఈ ఈవెంట్ వరకు వేచి ఉండలేం. అందుకే ఈ వారాన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో నింపుతాం. అందులో భాగంగానే ఇవాళ పృథ్వీరాజ్ లుక్ రిలీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.
News November 7, 2025
SECLలో 543 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్ (SECL)లో 543 అసిస్టెంట్ ఫోర్మెన్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి. డిపార్ట్మెంట్ అభ్యర్థులకు 3ఏళ్ల అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://secl-cil.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి
News November 7, 2025
సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.


