News March 29, 2024
BIG BREAKING: టీడీపీ ఫైనల్ జాబితా విడుదల

ఎంపీ అభ్యర్థులు: విజయనగరం- అప్పలనాయుడు, ఒంగోలు- మాగుంట శ్రీనివాసులురెడ్డి, కడప-భూపేష్ రెడ్డి, అనంతపురం- అంబికా లక్ష్మీనారాయణ.
ఎమ్మెల్యే అభ్యర్థులు: చీపురుపల్లి- కళా వెంకట్రావు, పాడేరు- వెంకట రమేశ్, రాజంపేట- సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు- వీరభద్ర గౌడ్, గుంతకల్లు- గుమ్మనూరు జయరాం, కదిరి- వెంకట ప్రసాద్, భీమిలి- గంటా శ్రీనివాస్, దర్శి- గొట్టిపాటి లక్ష్మి, అనంతపురం- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్.
Similar News
News December 11, 2025
12వ తరగతి వరకు ఒకే బోర్డు!

TG: పాఠశాల విద్యలో సమూల సంస్కరణలకు ప్రభుత్వం నిర్ణయించింది. SSC, ఇంటర్ బోర్డులను ఏకంచేసి 1-12వ తరగతి వరకు ‘స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్’ (TGSEB)ను ఏర్పాటు చేయనుంది. ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూళ్లన్నీ దీని పరిధిలో చేరుతాయి. ఇక GOVT, AIDED, PVT, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యానాణ్యత పర్యవేక్షణకు ‘స్కూల్ స్టాండర్డ్స్ అథారిటీ’ (TGSSA)ని పెట్టనుంది. TG రైజింగ్ డాక్యుమెంట్లో వీటిని పొందుపరిచింది.
News December 11, 2025
తీపి వస్తువులు పూర్తిగా మానేస్తున్నారా?

షుగర్ వస్తుందనే భయంతో చాలామంది తీపి పదార్థాలను పూర్తిగా మానేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు తింటే ఇబ్బంది లేదని, అది కూడా తక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘చక్కెర అధికంగా తీసుకుంటే ఊబకాయం, షుగర్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో సమతుల్యం చేసుకుని అప్పుడప్పుడు (వారానికి ఒకసారి) స్వీట్స్ తింటే హాని కలగదు’ అని పేర్కొన్నారు. SHARE IT
News December 11, 2025
థాయ్లాండ్లో పట్టుబడిన లూథ్రా బ్రదర్స్

గోవా నైట్క్లబ్ <<18509860>>ప్రమాదం<<>>లో కీలక నిందితులు గౌరవ్, సౌరభ్ లూథ్రా థాయ్లాండ్లో పట్టుబడ్డారు. డిసెంబర్ 7న రాత్రి క్లబ్లో మంటలు చెలరేగి 25 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే వీరిద్దరూ పరారయ్యారు. నిబంధనల ఉల్లంఘనే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు. త్వరలో లూథ్రా బ్రదర్స్నూ భారత్కు తీసుకురానున్నారు.


