News April 10, 2025
BIG NEWS: ఒలింపిక్స్లో T20 ఫార్మాట్ క్రికెట్

లాస్ఏంజెలిస్ 2028 ఒలింపిక్స్లో T20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో 6 టీమ్స్ చొప్పున పాల్గొంటాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90మంది క్రికెటర్లకు అనుమతినిస్తూ IOC నిర్ణయం తీసుకుంది. T20 ర్యాంకింగ్స్లో టాప్-6 జట్లు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం ఉంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది.
Similar News
News November 13, 2025
భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్

నిన్న కాస్త తగ్గి రిలీఫ్ ఇచ్చిన గోల్డ్ రేట్స్ ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.2,290 పెరిగి రూ.1,27,800కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.2,100 ఎగబాకి రూ.1,17,150గా నమోదైంది. అటు వెండి ధర ఇవాళ కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేట్ రూ.9వేలు పెరిగి రూ.1,82,000కు చేరింది.
News November 13, 2025
నాలుగు ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర: నిఘా వర్గాలు

‘ఢిల్లీ పేలుడు’పై దర్యాప్తు చేపట్టిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. 8 మంది ఇద్దరిద్దరుగా విడిపోయి 4 ప్రధాన నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారని సమాచారం. ప్రతి గ్రూప్ భారీగా IED తీసుకెళ్లాలని నిర్ణయించారని, పేలుళ్ల కోసం 20 క్వింటాళ్లకు పైగా ఎరువులను సేకరించినట్లు తెలిసింది. మరోవైపు ఢిల్లీ బ్లాస్ట్కు ముందు ఉమర్కు రూ.20 లక్షల డబ్బు అందిందని నిఘా వర్గాలు గుర్తించాయి.
News November 13, 2025
NIT వరంగల్ 45పోస్టులకు నోటిఫికేషన్

<


