News April 29, 2024
ఈసీ నిర్ణయంతో జనసేనకు బిగ్ రిలీఫ్

AP: జనసేనకు గాజు గ్లాసును కామన్ గుర్తుగా కేటాయిస్తూ EC ఆదేశాలతో ఆ పార్టీకి బిగ్ రిలీఫ్ లభించింది. దీంతో రాష్ట్రంలో జనసేన పోటీ చేయని చోట్ల ఇతరులకు ఈ గుర్తు కేటాయించే అవకాశం ఉండదు. జనసేన 21 అసెంబ్లీ, 2 MP స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును తమకు కేటాయించాలని కొందరు ఈసీని కోరారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ECకి జనసేన లేఖ రాయగా.. అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.
Similar News
News November 24, 2025
దివ్యాంగురాలి దగ్గరకు వెళ్లి అర్జీ తీసుకున్న ప.గో కలెక్టర్

అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని ప.గో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కాగా, ఓ దివ్యాంగురాలు అర్జీ ఇచ్చేందుకు రాగా.. కలెక్టర్ స్వయంగా ఆమె వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.
News November 24, 2025
BELOPలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<
News November 24, 2025
భారత్కు మరో ఓటమి తప్పదా?

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఓడిన టీమ్ఇండియా రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్సులో 201 పరుగులకే ఆలౌటై సఫారీలకు 288 రన్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అటు రేపు, ఎల్లుండి ఆట మిగిలి ఉండటంతో దూకుడుగా ఆడి <<18376327>>లీడ్<<>> పెంచుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. రెండో ఇన్నింగ్సులోనూ భారత ప్లేయర్లు ఇదే ప్రదర్శన చేస్తే 0-2తో సిరీస్ను చేజార్చుకునే ప్రమాదముంది. దీంతో WTCలో స్థానం దిగజారనుంది.


