News December 27, 2024
జియో యూజర్లకు బిగ్ షాక్

డైలీ డేటా అయిపోయినప్పుడు వినియోగించే రూ.19, రూ.29 డేటా వోచర్ల వ్యాలిడిటీని జియో తగ్గించింది. ఇప్పటివరకు ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసేవరకు ఈ వోచర్ వ్యాలిడిటీ ఉండేది. కానీ రూ.19తో రీఛార్జ్ చేస్తే వచ్చే 1జీబీ డేటాను ఒకరోజుకు, రూ.29 రీఛార్జ్ డేటా 2జీబీని రెండురోజులకు పరిమితం చేసింది. ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయం యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.
Similar News
News September 23, 2025
10 గ్రా. బంగారం ధర రూ.2లక్షలు?.. ‘జెఫరీస్’ అంచనా

ప్రపంచ ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారని, దీంతో ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రఖ్యాత స్టాక్ బ్రోకరేజ్ సంస్థ ‘జెఫరీస్’ గ్లోబల్ హెడ్ క్రిస్ వుడ్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న ధరల నుంచి ఏకంగా 77% మేర పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇదే నిజమైతే 10గ్రా బంగారం ధర ₹2 లక్షల మార్కును చేరుకోనుంది. అయితే ఎప్పటివరకు గోల్డ్ ఆ మార్క్ అందుకుంటుందో చెప్పలేదు.
News September 23, 2025
పవన్ కళ్యాణ్కు వైరల్ ఫీవర్

AP: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారినపడ్డారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గత రెండు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని, ఫీవర్తోనే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారని తెలిపాయి. నిన్న రాత్రి నుంచి జ్వరం తీవ్రత పెరిగిందని, వైద్యులు పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నాయి. విశ్రాంతి అవసరమని సూచించారని వివరించాయి.
News September 23, 2025
ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.