News February 1, 2025
జియో యూజర్లకు బిగ్ షాక్

2 డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను రిలయన్స్ జియో తగ్గించింది. రూ.69, రూ.139 ప్లాన్ల గడువును 7 రోజులుగా ఫిక్స్ చేసింది. గతంలో బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే ఈ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీ అప్పటివరకు ఉండేవి. ఇకపై రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6GB, రూ.139తో చేస్తే వచ్చే 12GB డేటా వారం రోజులే పనిచేస్తుంది. అటు ఇటీవల తొలగించిన రూ.189 ప్లాన్(28 రోజులు, 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS)ను జియో మళ్లీ ప్రారంభించింది.
Similar News
News January 13, 2026
‘MSVPG’కి ఫస్ట్ డే రూ.84 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం నిన్న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్+ఫస్ట్ డేకి కలిపి రూ.84 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సెంటర్లలో రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయని పేర్కొంది. చిరంజీవి లుక్స్, మేనరిజం, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అభిమానులను మెప్పిస్తున్నాయి.
News January 13, 2026
టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

CSIR-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (<
News January 13, 2026
రూ.5,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,42,530కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,30,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,92,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుంటాయి.


