News November 28, 2024
కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 28, 2025
సర్పంచ్గా మొదలై.. 5 సార్లు MLAగా గుమ్మడి నర్సయ్య

ఖమ్మం(D) సింగరేణి(M) టేకులగూడేనికి చెందిన గుమ్మడి నర్సయ్య రాజకీయాల్లో సుపరిచితం. ఆయన రాజకీయ జీవితం మొదటగా సొంత గ్రామానికి సర్పంచ్గా మొదలైంది. ఆ తర్వాత ఇల్లందు నుంచి CPI ML న్యూడెమోక్రసీ తరఫున ఏకంగా 5 సార్లు MLAగా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిస్వార్థ, నిరాడంబర ప్రజానేతగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య జీవితం, నేడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిజంగా ఆదర్శనీయం కదూ.
News November 28, 2025
సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.
News November 28, 2025
టుడే టాప్ స్టోరీస్

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్


