News March 18, 2024

టీడీపీకి బిగ్ షాక్?

image

AP: విశాఖ జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత బండారు సత్యనారాయణ వైసీపీతో టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. జనసేనకు సీట్లు కేటాయించిన ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని TDP అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నారట. వారందరితో కలిసి వైసీపీలో చేరే అవకాశం ఉంది. అటు బండారుకు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇచ్చే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News April 1, 2025

వడగాలులు, పిడుగులతో వర్షాలు.. రేపు జాగ్రత్త

image

AP: రాష్ట్రంలో రేపు 30, ఎల్లుండి 47 మండలాల్లో <>వడగాలులు ప్రభావం చూపే<<>> అవకాశం ఉన్నట్లు APSDMA వెల్లడించింది. రేపు శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం ఉత్తరాంధ్ర, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని పేర్కొంది. రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

News April 1, 2025

జొమాటోలో 600 మంది ఉద్యోగులు ఔట్

image

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో తన ఉద్యోగులకు షాకిచ్చింది. కస్టమర్ సపోర్ట్ అసోసియేట్స్‌గా పనిచేస్తున్న దాదాపు 600 మందిని తొలగించింది. ఈ విభాగంలో ఏడాది కిందట 1,500 మందిని నియమించుకోగా, ఇంతలోనే పలువురికి లేఆఫ్స్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేలవమైన పనితీరు, ఆలస్యంగా రావడం వంటి కారణాలు చూపుతూ ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే తొలగించినట్లు సిబ్బంది వాపోతున్నారు.

News April 1, 2025

ట్రంప్ సుంకాల ప్రభావం.. ఈ దేశాలే లక్ష్యం?

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించనున్న సుంకాలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప్రధానంగా 10 నుంచి 15 దేశాలపై వాటి ప్రభావం ఉంటుందని అంచనా. చైనా, ఐరోపా సమాఖ్య దేశాలు, మెక్సికో, వియత్నాం, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా, కెనడా, భారత్, థాయ్‌లాండ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలను అమెరికా లక్ష్యంగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!