News January 27, 2025

ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలానికొకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాత కార్డుల్లో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైందని, 20,336 మంది అకౌంట్లలో ₹6K చొప్పున జమ చేసినట్లు చెప్పారు.

Similar News

News January 6, 2026

పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి: రోజా

image

AP: దేశంలోనే అట్టడుగు స్థానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. కేంద్రం నివేదికను చూసి చంద్రబాబు, అనిత సిగ్గుపడాలన్నారు. మన పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని చెప్పారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదరులతో ములాఖత్ అనంతరం ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలను అక్రమ కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు.

News January 6, 2026

అసలు ఈ ‘కార్తీక దీపం’ వివాదం ఏంటంటే?

image

TN తిరుప్పరకుండ్రంలోని సుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులు కొండ కిందనున్న మండపం వద్ద దీపారాధన చేస్తారు. కానీ కొండపైన <<18776962>>దీపం వెలిగించాలని<<>> ఎప్పట్నుంచో డిమాండ్ ఉంది. కొండపై దర్గా ఉండటంతో దీనిపై 1920ల నుంచి వివాదాలున్నాయి. 1994లో ఓ భక్తుడు కోర్టుకెళ్లగా 1996లో మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఆ ఆర్డర్‌నే ప్రభుత్వం ఇన్నాళ్లు ఆధారంగా చూపింది. ఇటీవల సింగిల్ జడ్జి అనుమతిస్తే దానిని సవాలు చేసిన విషయం తెలిసిందే.

News January 6, 2026

అమ్మ కోసం ఉద్యోగాన్నే మానేసింది

image

కొందరు మేనేజర్లు ఎంత దారుణంగా ఉంటారో చెప్పే ఘటన ఒకటి SMలో వైరలవుతోంది. ఓ బ్యాంకులో కొన్నేళ్లుగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగి తల్లికి ఆరోగ్యం పాడైంది. కొన్నిరోజులు హాస్పిటల్‌లో ఉంచాలని సెలవులడిగారు. అందుకు మేనేజర్ ‘ఆమె కోలుకోకపోతే షెల్టర్‌లో ఉంచి జాబ్‌కి రా’ అని ఆదేశించారు. కానీ ఆమె పట్టించుకోలేదు. ఆఖరికి జాబ్‌కి రిజైన్ చేయాల్సి వచ్చింది. రాజీనామా చేసింది గానీ తన తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు.