News September 23, 2024

కొత్త పెన్షన్లపై BIG UPDATE

image

AP: కొత్త పెన్షన్లను అక్టోబర్ నుంచి అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గతంలో తొలగించిన లక్షల మంది లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీల తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగుల్లో అర్హులు, అనర్హులను గుర్తించనున్నారు. సచివాలయాల్లో జాబితాను ప్రదర్శించి, అనర్హుల నుంచి వివరణ తీసుకుంటారు. క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై త్వరలో విధివిధానాలు ప్రకటించే ఛాన్సుంది.

Similar News

News October 14, 2025

బాహుబలిని బీట్ చేసిన కాంతార ఛాప్టర్-1

image

కాంతార ఛాప్టర్-1 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. వరల్డ్ వైడ్‌గా రూ.675Cr వసూలు చేసి బాహుబలి-ది బిగినింగ్(రూ.650Cr)ను బీట్ చేసింది. ఇదేక్రమంలో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’(రూ.628Cr) రికార్డు కూడా బద్దలైంది. దీంతో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-20 చిత్రాల్లో 17వ స్థానానికి ఎగబాకింది. అటు 2025లో హయ్యెస్ట్ గ్రాస్ పొందిన సినిమాల్లో రెండో ప్లేస్‌ దక్కించుకుంది. ఫస్ట్ ప్లేస్‌లో ఛావ(రూ.808Cr) ఉంది.

News October 14, 2025

BREAKING: గూగుల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

image

ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీ గూగుల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలపై అగ్రిమెంట్ కుదిరింది. CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ.88,628 కోట్లతో ఒక గిగావాట్ కెపాసిటీతో 2029 నాటికి విశాఖలో డేటా సెంటర్ పూర్తికి గూగుల్ ప్రణాళికలు సిద్ధం చేసింది.

News October 14, 2025

రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు: మంత్రి లోకేశ్

image

AP: విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. ఇది గ్లోబల్ టెక్ మ్యాప్‌పై APని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందన్నారు. ఢిల్లీలో గూగుల్‌తో ఒప్పంద కార్యక్రమంలో మాట్లాడారు. కేంద్రం సహకారం, విజనరీ లీడర్ CBN నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని చెప్పారు. డిజిటల్ హబ్‌గా దేశానికి మంచి గుర్తింపు లభిస్తుందన్నారు.