News August 14, 2024
గనుల రాష్ట్రాలకు ఘన విజయం.. రాయల్టీ వసూలుకు సుప్రీం అనుమతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_82024/1723618791483-normal-WIFI.webp)
మైనింగ్ కంపెనీల నుంచి రాయల్టీ బకాయిలను రాష్ట్రాలు వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2005 ఏప్రిల్ 1 తర్వాత బకాయిలను 12 ఏళ్ల వ్యవధిలో వసూలు చేసుకోవాలని, చెల్లింపులపై జరిమానాలు విధించొద్దని ఆదేశించింది. PSUలపై రూ.70వేల కోట్లు, ప్రజలపై భారం పడుతుందని దీనిని కేంద్రం వ్యతిరేకిస్తోంది. గనుల భూమిపై రాయల్టీ అధికారం రాష్ట్రాలదేనని జులై 25న సుప్రీం కోర్టు 8:1 తేడాతో తీర్పునిచ్చింది.
Similar News
News February 8, 2025
వెలువడుతున్న ఫలితాలు.. బీజేపీ 4, ఆప్ 1
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32023/1679908528116-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు లీడింగ్లో కొనసాగిన BJP, AAP విజయాలు నమోదు చేస్తున్నాయి. BJP 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. మరో 42స్థానాల్లో కమలదళం, 23చోట్ల ‘చీపురు’ పార్టీ లీడింగ్లో కొనసాగుతున్నాయి. వాస్తవానికి ఆప్ 26 సీట్లలో ఆధిక్యంలో ఉండగా కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా వెనుక పడిపోవడంతో ఆధిక్యం 23కు తగ్గింది. అగ్రనేతలే ఆ పార్టీకి భారం కావడం గమనార్హం.
News February 8, 2025
1000 వికెట్లు సాధించడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996625447_1045-normal-WIFI.webp)
టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు(461 మ్యాచుల్లో 633 వికెట్లు) తీసిన అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 1000 వికెట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1000 వికెట్లు దక్కించుకోవడమనేది నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత. ఫిట్గా ఉండి, ఇప్పుడు ఆడుతున్న స్థాయిలోనే ఆడితే మరో మూడు, నాలుగేళ్లలో కచ్చితంగా తీస్తా. 4అంకెల వికెట్లు అనేది బౌలర్ ఊహకు మాత్రమే సాధ్యం’ అని పేర్కొన్నారు.
News February 8, 2025
‘ఢిల్లీ కింగ్మేకర్: నిర్మలా సీతారామన్’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738996824029_1199-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి FM నిర్మలా సీతారామనే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నగరంలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటారు. వారి చిరకాల కోరికైన Income Tax తగ్గింపును నిర్మలమ్మే తీర్చారని పేర్కొంటున్నారు. 50:50 ఉన్న విజయ సమీకరణాన్ని ఆమె BJP వైపు మార్చేశారని విశ్లేషిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో 50% కన్నా ఎక్కువ వారికే పడటం దీనిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.