News October 6, 2025
బిహార్ ఎన్నికలు.. వివరాలు

*మొత్తం ఓటర్లు: 7.43 కోట్లు
*పురుషులు: 3.92 కోట్లు
*మహిళలు: 3.50 కోట్లు
*ట్రాన్స్జెండర్లు: 1,725
*85 ఏళ్లు దాటినవారు: 4.04 లక్షలు
*వందేళ్లు పైబడిన ఓటర్లు: 14 వేలు
*మొదటిసారి ఓటు వేసేది: 14.01 లక్షలు
*పోలింగ్ స్టేషన్లు: 90,712
Similar News
News October 6, 2025
ట్రయథ్లాన్ అంబాసిడర్గా సయామీఖేర్

బాలీవుడ్ నటి, అథ్లెట్ సయామీ ఖేర్ ‘ఐరన్మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్కు అంబాసిడర్గా ఎంపికయ్యారు. ఏడాదిలోపు రెండుసార్లు ‘ఐరన్మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్ పూర్తి చేసినందుకుగానూ ఐరన్మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆమెను ఎంపిక చేసింది. ఇందులో ఈత(1.9 KM), సైక్లింగ్(90 KM), పరుగు(21.1 KM) పోటీల్లో వరుసగా పాల్గొనాలి. గతేడాది సెప్టెంబరులో తొలిసారి, ఈ ఏడాది జులైలో రెండోసారి సయామీ సత్తాచాటి పతకం అందుకున్నారు.
News October 6, 2025
స్థానిక సంస్థల్లో BCలకు 34% కోటాపై CBN ఆదేశాలు

AP: BCలను ఉన్నతస్థాయికి తీసుకెళ్లేలా భారీగా నిధులు వెచ్చిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదని CM CBN అన్నారు. అందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చూడాలని అధికారులకు సంక్షేమ సమీక్షలో సూచించారు. కులవృత్తుల్లో ఆధునీకరణతోనే ఆయా వర్గాలు ఎక్కువ ఆదాయాన్ని పొందగలవని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News October 6, 2025
2019 తర్వాతా CBN సీఎంగా ఉంటే పోలవరం పూర్తయ్యేది: నిమ్మల

2027 చివరి నాటికి PM చేతుల మీదుగా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. 2019 తర్వాత సీఎంగా CBN కొనసాగుంటే ఇప్పటికే అది పూర్తయ్యేదన్నారు. YCP హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, రివర్స్ టెండర్లంటూ పనులు జాప్యం చేశారని విమర్శించారు. తాము పనులు వేగవంతం చేశామన్నారు. బిహార్ ఎన్నికలయ్యాక కేంద్ర మంత్రి CRపాటిల్ ప్రాజెక్టును సందర్శిస్తారని ఆయనతో భేటీ అనంతరం చెప్పారు.