News September 22, 2024
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తింటున్నారా?
‘టీ’లో బిస్కెట్లు ముంచుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చాయ్లో బిస్కెట్లు తింటే అధిక షుగర్ కంటెంట్ శరీరానికి చేరుతుంది. బిస్కెట్లను షుగర్, మైదాపిండితో తయారు చేయడంతో చక్కెర స్థాయులు పెరుగుతాయి. శరీరంలో వాపు, హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత, బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయి. గుండె సంబంధిత సమస్యలూ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. హెర్బల్ టీ తాగడం ఉత్తమం.
Similar News
News September 22, 2024
రేపు తిరుమలలో శాంతియాగం: చంద్రబాబు
AP: జరిగిన తప్పులు క్షమాపణకు శాంతి యాగం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు శాంతి హోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద చేస్తామన్నారు. ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అధికార దుర్వినియోగంపై సిట్ వేస్తామని చెప్పారు. తిరుమల పవిత్రతను కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామన్నారు.
News September 22, 2024
చెస్ ఒలింపియాడ్లో చరిత్ర సృష్టించిన భారత్
చెస్ ఒలింపియాడ్లో తొలిసారిగా స్వర్ణాన్ని గెలుచుకుని భారత్ చరిత్ర లిఖించింది. స్లోవేనియాతో జరిగిన చివరి రౌండ్లో వ్లాదిమిర్ ఫెదోసీవ్ను గుకేశ్, ఇరిగేశీ జాన్ సుబెల్జ్ను అర్జున్ ఓడించారు. దీంతో ఇండియాకు స్వర్ణం ఖాయమైంది. అటు అమ్మాయిల బృందం కూడా స్వర్ణం గెలవడంతో భారత్కు ‘ఒలింపియాడ్ డబుల్’ సొంతమైంది.
News September 22, 2024
దేవుడికి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడా?: సీఎం
AP: గత పాలకులు తిరుమలలో చేసిన అపచారాన్ని ప్రజలు మర్చిపోరని CM చంద్రబాబు అన్నారు. ‘అన్యమతస్థులు కొండపై వ్యాపారాలు చేశారు. క్రిస్టియన్ సంప్రదాయంలో కుమార్తె పెళ్లి చేసిన భూమన కరుణాకర్రెడ్డిని TTD ఛైర్మన్ను చేశారు. కుమారుడు చనిపోతే EO ధర్మారెడ్డి కొండపైకి వెళ్లారు. దేవుడికి ఇలాంటి అపచారాలు చేసి మళ్లీ ఎదురుదాడి చేస్తారా? ‘ అని CM ప్రశ్నించారు. అపచారాలు చేసి కూడా YCP నేతలు పశ్చాత్తాపం పడటం లేదన్నారు.