News December 21, 2024

$92,281 నుంచి $97,454కు పెరిగిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కొంతమేర పుంజుకున్నాయి. బిట్‌కాయిన్ $92,281 నుంచి $97,454 (Rs83 లక్షలు) స్థాయికి పెరిగింది. మార్కెట్ డామినెన్స్ 56.95 శాతంగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.48% పెరిగి $3,471 వద్ద ట్రేడవుతోంది. $3098 కనిష్ఠ స్థాయి నుంచి ఎగిసింది. BNB, USDT, DOGE, ADA, AVAX, LLINK, TON, SUI, SHIB లాభపడ్డాయి. XRP, SOL, USDC, TRX, LINK, XLM నష్టపోయాయి.

Similar News

News November 20, 2025

హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

image

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు హిడ్మా మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా బుధవారం రాత్రి వరకు హిడ్మా, అతని భార్య రాజేతోపాటు మరో మావోయిస్టు మృతదేహానికి మాత్రమే రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగింది. మరో ముగ్గురి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు.

News November 20, 2025

శబరిమల భక్తులకు అలర్ట్!

image

భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 20 వేల నుంచి 5 వేలకు తగ్గించింది. వర్చువల్ క్యూ ద్వారా మరో 70 వేల మందిని అనుమతించనుంది. ఈ మేరకు రోజుకు 75 వేల మందికి దర్శనం కల్పించనుంది. అడవి మార్గంలో వచ్చే భక్తులకు పాసులు తప్పనిసరి అని స్పష్టం చేసింది. రద్దీని తగ్గించేందుకు నీలక్కల్ దగ్గర కొత్తగా 7 బుకింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.

News November 20, 2025

నేడు సీబీఐ కోర్టుకు జగన్

image

AP: అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన కోర్టుకు వస్తారని సమాచారం. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బేగంపేటకు చేరుకుంటారని తెలుస్తోంది. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని YCP నాయకులు భావిస్తున్నారు.