News December 30, 2024
BITCOIN: 24 గంటల్లో Rs 1.32L లాస్

క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ 1.48% తగ్గి $3.28Tగా ఉంది. గత 24 గంటల్లో బిట్కాయిన్ 1.77% మేర తగ్గి $1561 (Rs 1.32L) నష్టపోయింది. ప్రస్తుతం $93,412 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $1.84Tగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 0.16% తగ్గి $3,387 వద్ద చలిస్తోంది. XRP 4.19, BNB 2.52, SOL 2.15, DOGE 2.37, ADA 1.84, TRX 0.74, AVAX 3.02% మేర పడిపోయాయి.
Similar News
News November 27, 2025
ఏలూరు: సీఎం పర్యటనపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈమేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అందుకు సంబంధించి ఆయా ప్రదేశాలలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.
News November 27, 2025
జీవో 46పై విచారణ రేపటికి వాయిదా

TG: ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ఈ జీవో జారీ చేయడంతో వెనుకబడిన కులసంఘాలు పిటిషన్లు వేశాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది సుదర్శన్ అత్యవసర పిటిషన్గా విచారణ చేపట్టాలని కోరారు. బీసీలలో A, B, C, D వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని అభ్యర్థించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది.
News November 27, 2025
లడ్డూ విషయంలో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం: YV సుబ్బారెడ్డి

AP: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తాను 30 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నానని, దేవుడి ప్రతిష్ఠ పెంచేలా పని చేశానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి ఘటనలో నిజాలు తెలియజేయడానికి సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు వెల్లడించారు.


