News February 8, 2025
BJPని గెలిపిద్దాం: కామారెడ్డి MLA

పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ BJP గెలవాలని కామారెడ్డి MLA వెంకటరమణరెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కామారెడ్డిలో ఆయన మాట్లాడారు. అన్ని చోట్ల BJP గెలిచేలా ఇప్పటి నుంచే కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా రెడీగా ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
Similar News
News October 28, 2025
HYD: జూబ్లీహిల్స్లో స్పీడ్ పెంచిన కాంగ్రెస్..!

HYD జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నేడు ఉపఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇన్ఛార్జ్ మహేశ్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు పాల్గొన్నారు. ఇక ఎన్నికల వరకు అందరూ జూబ్లీహిల్స్లోనే ఉంటూ ఫుల్ ఫోకస్ పెట్టనున్నారు.
News October 28, 2025
మేడ్చల్, మల్కాజిగిరి యూనిట్లలోని మద్యం షాపులకు డ్రా

మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలోని 118 వైన్స్ షాప్ టెండర్లకు గాను ఈరోజు జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూ చౌదరి ఆధ్వర్యంలో డ్రా తీశారు. అదే విధంగా మల్కాజిగిరి యూనిట్ పరిధిలోని 88 వైన్స్ షాప్లకు గాను అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో డ్రా తీశారు. మద్యం షాపులకు డ్రాను పీర్జాదిగూడలోని శ్రీ పళని కన్వెన్షన్ హాల్లో తీశారు.
News October 28, 2025
HYD: చున్నీతో గొంతు బిగించి భర్తను చంపింది..!

HYD బాలాపూర్ మండలం మీర్పేట్ PS పరిధిలో విజయ్ కుమార్ అనుమానాస్పద మరణం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోస్ట్మార్టం నివేదికలో హత్యగా నిర్ధారణ కావడంతో భార్య సంధ్య నిందితురాలని తేలింది. మద్యం తాగి, వేధించే భర్తతో నిత్యం గొడవ జరుగుతుండడంతో అక్టోబర్ 19న చున్నీతో గొంతు బిగించి చంపినట్లు సంధ్య ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.


