News December 24, 2025
BJP సర్పంచులున్న గ్రామాలకు బండి సంజయ్ వరాలు

TG: గ్రామాభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆందోళన అక్కర్లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్లోని సర్పంచులు, ఉప సర్పంచులను సన్మానించారు. ‘BJP సర్పంచులున్న గ్రామాల్లో వాటర్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు నిర్మిస్తాం. 9వ తరగతి చదువుతున్న పిల్లలకు ఫ్రీగా సైకిళ్లిస్తాం. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యానికి అత్యాధునిక పరికరాలు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 26, 2025
TCIL 25 పోస్టులకు నోటిఫికేషన్

టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News December 26, 2025
‘ఆరావళి’కి తూట్లు.. ఏడేళ్లలో 4 వేల అక్రమ మైనింగ్ కేసులు!

ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్ అంశం తీవ్ర <<18663286>>వివాదానికి<<>> దారి తీసిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో ఆరావళి పర్వతాలు విస్తరించిన జిల్లాల్లో 4,181 అక్రమ మైనింగ్ కేసులు నమోదైనట్లు తాజాగా వెల్లడైంది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లలో మొత్తం 7,173 FIRలు రిజిస్టర్ చేసినట్లు తేలింది. రాష్ట్రంలో 71 వేల ఇల్లీగల్ మైనింగ్ ఘటనలు జరిగితే అందులో ఆరావళి జిల్లాల్లోనే 40 వేలు ఉండటం గమనార్హం.
News December 26, 2025
కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.


