News May 11, 2024
రాజమండ్రిలో బీజేపీ, వైసీపీ హోరాహోరీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి పోటీ చేస్తున్న లోక్సభ స్థానం రాజమండ్రి. 1998, 1999లో ఇక్కడ BJP గెలిచింది. టీడీపీ, జనసేన సపోర్ట్తో ఎలాగైనా ఈ సీటుని తమ ఖాతాలో వేసుకోవాలని BJP ప్రయత్నిస్తోంది. ఇటు BC నేత గూడూరు శ్రీనివాస్ని YCP బరిలోకి దింపింది. కాగా ఏపీపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ ఎవరి ఓట్లు చీలుస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.
News October 27, 2025
గిరిజనులకు 89,845 దోమతెరలు: సత్యకుమార్

AP: అల్లూరి, మన్యం జిల్లాల్లో మలేరియా ఇతర జ్వరాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 743 గ్రామాల్లోని గిరిజన కుటుంబాలకు 89,845 దోమతెరలను ఉచితంగా అందిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. దీనివల్ల 2 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. దోమలను సంహరించే మందును ఉపయోగించి తయారు చేసే ఈ దోమతెరలను 4 ఏళ్లవరకు వినియోగించొచ్చని తెలిపారు.
News October 27, 2025
మళ్లీ తగ్గిన బంగారం ధరలు!

బంగారం ధరలు గంటల వ్యవధిలోని <<18115652>>మరోసారి<<>> తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,340 తగ్గి రూ.1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,150 పతనమై రూ.1,13,000గా పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.1,70,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


