News April 24, 2024

బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం.. కేటీఆర్ సెటైర్

image

సూరత్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘వన్ నేషన్-నో ఎలక్షన్.. ఎన్నికల కమిషన్ పనితీరు బాగుంది’ అని పేర్కొన్నారు. సూరత్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను ఈసీ తిరస్కరించింది. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమైంది.

Similar News

News November 22, 2025

భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

image

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.

News November 22, 2025

ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

image

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

News November 22, 2025

రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

image

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.