News March 19, 2024

నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో బీజేపీ మరో జాబితా ప్రకటనపై కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో ఇవాళ ఆ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 13 రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించి, పేర్లు ప్రకటించనుంది. తెలంగాణలోని 15 స్థానాలకు పేర్లు ప్రకటించగా.. మిగిలిన 2 స్థానాలు, పొత్తులో భాగంగా ఏపీలో పోటీ చేసే 6 సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

Similar News

News January 24, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,470 పెరిగి రూ.1,58,620కి చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,350 ఎగబాకి రూ.1,45,400 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.3,60,100 వద్ద కొనసాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News January 24, 2026

Republic day Special: అరుణా అసఫ్‌ అలీ

image

అరుణా అసఫ్‌ అలీ గొప్ప దేశభక్తురాలు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు. ఉప్పు సత్యాగ్రహం సమయంలో జైలు శిక్ష అనుభవించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించడంతో బ్రిటిష్‌ ప్రభుత్వం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. 1942లో అజ్ఞాతంలో ఉంటూనే ఉద్యమాన్ని కొనసాగించారు. 1997లో మరణాంతరం ప్రభుత్వం ఆమెకు ‘భారతరత్న’ ప్రదానం చేసింది.

News January 24, 2026

ఢిల్లీ.. ఊపిరి పీల్చుకో!

image

దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు ఇవాళ కాస్త స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వర్షాలు, గాలి వేగం పెరగడంతో వాయు కాలుష్యం తగ్గి గాలి నాణ్యత కొద్దిగా మెరుగైంది. సగటున AQI 249 పాయింట్లుగా నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిర్ క్వాలిటీ క్షీణించడంతో కొన్ని నెలలుగా అక్కడి వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలతో పాటు మంచు కురుస్తోంది.