News September 11, 2024
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర: మంత్రి అతిశీ

ఢిల్లీ రాజ్యాంగ సంక్షోభం ఎదుర్కొంటోందని రాష్ట్రపతికి BJP మెమొరాండంను సమర్పించడంపై మంత్రి అతిశీ మండిపడ్డారు. రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్ర జరుగుతోందని దుయ్యబట్టారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఆప్కు 70 సీట్లనూ కట్టబెట్టి కమలం పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, మణిపుర్ ప్రభుత్వాలను కూల్చిన ఘనత BJPకి ఉందన్నారు.
Similar News
News November 27, 2025
స్కిల్స్ లేని డిగ్రీలెందుకు: స్టూడెంట్స్

మారుతున్న ఉద్యోగ మార్కెట్కు అనుగుణంగా అకడమిక్ సిలబస్లో మార్పులు తీసుకురావాలని కొందరు విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాలేజీ దశలోనే నైపుణ్య ఆధారిత కోర్సులు, ఉద్యోగ కోచింగ్ అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నైపుణ్యం లేని డిగ్రీలతో బయటకు వస్తే ఉద్యోగాలు దొరకడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అందుకే ఉద్యోగం ఇప్పిస్తామని <<18402171>>మోసం<<>> చేసేవారు పెరుగుతున్నారన్నారు. మీ కామెంట్?
News November 27, 2025
7,948 MTS, హవల్దార్ పోస్టులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 27, 2025
రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.


