News June 2, 2024
బీజేపీ పరువునష్టం కేసు.. రాహుల్కు కోర్టు ఆదేశాలు

పరువునష్టం కేసుకు సంబంధించి ఈనెల 7న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శనివారం విచారణకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభివృద్ధి పనుల్లో నాటి BJP ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ పరువునష్టం దావా వేసింది.
Similar News
News February 10, 2026
పుస్తకం అందుబాటులో ఉందని నరవణెనే చెప్పారు: రాహుల్

నరవణె పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై రాజకీయ వివాదం కొనసాగుతోంది. ఈ బుక్ను ఇప్పటి వరకు ప్రచురించలేదని <<19098532>>‘పెంగ్విన్’<<>> చెప్పగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ‘తన పుస్తకం అందుబాటులోకి వచ్చిందని స్వయంగా నరవణెనే చెప్పారు. ఆయన అబద్ధం అయినా చెప్పాలి. లేకపోతే పెంగ్విన్ అయినా అబద్ధం చెబుతుండాలి. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని అనుకోను’ అని రాహుల్ అన్నారు.
News February 10, 2026
పోలవరానికి రూ.32వేల కోట్లు ఇవ్వాలి: సీఎం

AP: సీఎం చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి CR పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరానికి సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేయాలని కోరారు. ఈ ప్రాజెక్టుకు అదనంగా ₹32K కోట్లు ఇవ్వాలన్నారు. ‘నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలి. AP-ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలి. కృష్ణాపై కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు పనులను అడ్డుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు.
News February 10, 2026
ఎప్స్టీన్తో మస్క్, జుకర్బర్గ్.. ‘వైల్డ్’ డిన్నర్ ఫొటో వైరల్!

ఎప్స్టీన్ ఫైల్స్ టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. 2015లో ఎప్స్టీన్ ఏర్పాటు చేసిన ఓ ‘వైల్డ్’ డిన్నర్లో మస్క్, జుకర్బర్గ్ పాల్గొన్నట్లు ఓ ఫొటో బయటపడింది. ఎప్స్టీన్ స్వయంగా తన మెయిల్లో దీని గురించి ప్రస్తావిస్తూ వారితో డిన్నర్ అదిరిపోయిందని రాసుకున్నాడు. అంతేకాదు గతంలో మస్క్ తన గర్ల్ఫ్రెండ్తో కలిసి ఎప్స్టీన్ ప్రైవేట్ ఐలాండ్లో పార్టీ ఎప్పుడు ఉంటుందని అడిగిన మెయిల్స్ కూడా బయటకొచ్చాయి.


