News June 2, 2024

బీజేపీ పరువునష్టం కేసు.. రాహుల్‌కు కోర్టు ఆదేశాలు

image

పరువునష్టం కేసుకు సంబంధించి ఈనెల 7న విచారణకు హాజరు కావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బెంగళూరులోని స్పెషల్ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో శనివారం విచారణకు హాజరైన కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు బెయిల్ మంజూరు చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు అభివృద్ధి పనుల్లో నాటి BJP ప్రభుత్వం 40% కమిషన్ తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీనిపై బీజేపీ పరువునష్టం దావా వేసింది.

Similar News

News February 2, 2026

ఫైనల్లో భారత్ ఎదురైతే.. పాక్‌కు మాజీల ప్రశ్న!

image

T20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదన్న పాక్ నిర్ణయాన్ని ఆ దేశ మాజీ ప్లేయర్లే విమర్శిస్తున్నారు. ‘ఫస్ట్ మ్యాచ్ బాయ్‌కాట్ సరే.. మరి ఫైనల్లో భారత్ ఎదురైతే అప్పుడు ఆడకుండానే కప్పు వారికిచ్చేస్తారా?’ అని దానిశ్ కనేరియా ప్రశ్నించారు. ఇది పాక్ భయపడుతోందనే సంకేతం ఇస్తుందని విమర్శించారు. మరోవైపు ‘క్రికెట్ ద్వారా దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, భారత్‌తో ఆడకపోవడం బాధాకరమని అఫ్రీది అభిప్రాయపడ్డారు.

News February 2, 2026

చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ తప్పదు: సజ్జల

image

AP: రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని, బందిపోట్ల మాదిరి TDP తమ నేతల ఇళ్లపై దాడులు చేస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్‌ల ఆదేశాలతో అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై పోలీసుల సమక్షంలోనే గూండాలు దాడి చేశారని పేర్కొన్నారు. లడ్డూ అంశంలో దొరికిపోవడంతో CBN ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక CBNకి రిటర్న్ గిఫ్ట్ తప్పని సరిగా ఇస్తామని హెచ్చరించారు.

News February 2, 2026

18, 19 తేదీల్లో విశాఖలో ఫ్లీట్ రివ్యూ, మిలాన్

image

AP: మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 19న మిలాన్-2026 జరగనున్నాయి. US, జర్మనీ, ఫ్రాన్స్ సహా 19 దేశాల నౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు విన్యాసాలు చేయనున్నాయి. దేశవిదేశాలకు చెందిన 4K మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ ఫ్లీట్‌కు రాష్ట్రపతి, గవర్నర్, CM, కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై CS విజయానంద్ ఇవాళ సమీక్ష నిర్వహించారు.