News October 30, 2025
రాహుల్పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ఓట్ల కోసం మోదీ <<18140008>>డాన్స్<<>> కూడా చేస్తారంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై BJP తీవ్రంగా స్పందించింది. బిహార్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసింది. ‘రాహుల్వి అత్యంత అవమానకర, అసభ్య వ్యాఖ్యలు. అత్యున్నత రాజ్యాంగ పదవి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి. PM వ్యక్తిత్వంపై దాడి చేయడమే’ అని మండిపడింది. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని, రాహుల్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.
Similar News
News October 30, 2025
ముంబై కిడ్నాప్.. ఆ 35 నిమిషాలు ఏం జరిగింది?

ముంబై <<18151381>>కిడ్నాప్ <<>>ఘటనలో క్విక్ రియాక్షన్ టీమ్ 35 నిమిషాల ఆపరేషన్ నిర్వహించింది. 8మంది కమాండర్ల టీమ్ బాత్రూమ్ ద్వారా స్టూడియోలోకి వెళ్లింది. తొలుత నిందితుడు రోహిత్తో చర్చలు జరిపింది. కానీ లోపలికొస్తే షూట్ చేస్తానని, గదిని తగలబెడతానని అతడు బెదిరించాడు. తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడంతో రోహిత్పై లీడ్ కమాండో కాల్పులు జరిపి గాయపరిచారు. అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించగా అక్కడ రోహిత్ చనిపోయాడు.
News October 30, 2025
ఇదేందయ్యా ఇదీ.. బంగారు నగలు ధరిస్తే రూ.50వేలు ఫైన్

మన దేశంలో బంగారు ఆభరణాలు ధరించడమంటే ఇష్టపడని వారుండరు. కానీ ఉత్తరాఖండ్లోని జౌన్సర్-బావర్ ప్రాంతంలో ఉన్న కంధర్ గ్రామ నివాసితులు వింత నిర్ణయం తీసుకున్నారు. స్థానికంగా అసమానతలు తగ్గించేందుకు ఒంటినిండా నగలు ధరిస్తే రూ.50వేలు జరిమానా విధించాలని గ్రామపెద్దలు నిర్ణయించారు. మహిళలు సైతం దీనికి అంగీకారం తెలిపారు. శుభకార్యాల్లో చెవిపోగులు, ముక్కుపుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలనే నిబంధన విధించారు.
News October 30, 2025
IPL: ముంబైని రోహిత్ వీడతారా? క్లారిటీ

రాబోయే IPL సీజన్లో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్(MI)ను వీడతారనే ఊహాగానాలకు బ్రేక్ పడింది. హిట్మ్యాన్ MIని వీడతారనే ప్రచారాన్ని తోసిపుచ్చుతూ ఆ ఫ్రాంచైజీ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘సూర్యుడు తిరిగి ఉదయిస్తాడు’ అనే క్యాప్షన్తో రోహిత్ ఫొటోను షేర్ చేసింది. ఈ ట్వీట్తో ముంబై జట్టులో రోహిత్ కొనసాగింపుపై క్లారిటీ వచ్చినట్లైంది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


