News March 17, 2024
నాగర్ కర్నూల్పై బీజేపీ ఫోకస్

నాగర్ కర్నూల్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈసారి ఎలాగైనా పాగా వేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికల్లో 1, 29, 021 ఓట్లు సాధించగా ఈసారి పక్కా గెలుస్తామని ఆపార్టీ నాయకులు చెబుతున్నారు. కాగా బీజేపీ ఎంపీ అభ్యర్థిగా భరత్ పోటీలో ఉన్నారు.
Similar News
News April 10, 2025
MBNR: ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

మహబూబ్గర్ జిల్లా నవాబ్పేట మండలం కారుకొండ గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న అంబేడ్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవం ఉంటుందని తెలంగాణ మాల మహానాడు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చెన్నకేశవులు తెలిపారు. అతిథులుగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎంపీ డీకే అరుణ, లక్ష్మారెడ్డి, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మంత్రి నరసింహయ్య రానున్నారని చెప్పారు.
News April 10, 2025
మహబూబ్నగర్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు

మహబూబ్నగర్ జిల్లాలో గత 24 గంటల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. మహమ్మదాబాద్ 39.9 డిగ్రీలు, నవాబుపేట 39.7 డిగ్రీలు, కౌకుంట్ల 39.6, చిన్నచింతకుంట 39.5, మిడ్జిల్ (M)కొత్తపల్లి 39.4, చిన్నచింతకుంట (M) వడ్డేమాన్ 39.2, మూసాపేట (M) జానంపేట 39.2, భూత్పూర్ (M) కొత్త మొల్గర 39.1, కోయిలకొండ 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు ఎండల తీవ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
News April 10, 2025
MBNR: నేటి నుంచి ధర్మాపూర్ శ్రీ పాండురంగస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్ గ్రామంలో వెలసిన మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కపిలాద్రి రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మన్యంకొండ ఆలయానికి అనుబంధంగా ఉన్న ఈ ఆలయం 200 ఏళ్ల చరిత్ర కలిగినట్లు స్థల పురాణం చెబుతోంది. ఈరోజు రాత్రికి వంశపారంపర్య ధర్మకర్త నరసింహయ్య ఇంటి నుంచి స్వామివారిని ఊరేగింపుగా పల్లకీలో గుట్ట పైకి చేరుస్తారు. రేపు ప్రభోత్సవం జరగనుంది.