News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 18, 2026
భారత వ్యతిరేక శక్తులతో రాహుల్కు సంబంధాలు: రిజిజు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆరోపణలు చేశారు. భారత వ్యతిరేక శక్తులతో ఆయనకు సంబంధాలున్నాయన్నారు. దేశ భద్రతకు ఆయన అత్యంత ప్రమాదకరమని మండిపడ్డారు. నక్సలైట్లు, తీవ్రవాదులను రాహుల్ కలుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు జార్జ్ సొరోస్ వంటి నేతలను కలుస్తున్నారని ANIతో చెప్పారు.
News February 18, 2026
ఇంటర్వ్యూతో హైదరాబాద్ ECILలో ఉద్యోగాలు

HYDలోని <
News February 18, 2026
రాష్ట్రంలో నేటి నుంచి శనగల కొనుగోళ్లు ప్రారంభం

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి శనగల కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. రబీలో 3.25 లక్షల హెక్టార్లలో పంట సాగవగా.. 3.77 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనా. కేంద్రం ఆదేశాలతో కనీస మద్దతు ధరల పథకం కింద 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేయనున్నారు. పంట అమ్మకానికి అన్నదాతలు రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని, పంట కొనుగోలు చేసిన 15 రోజుల్లో నగదు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


