News August 14, 2024

టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

image

బెంగాల్‌లో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం ఘ‌ట‌నపై అధికార టీఎంసీని విప‌క్ష‌ బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్ర‌భుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఆర్జీ కర్ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్‌ను మ‌రో కాలేజీకి ప్రిన్సిప‌ల్‌గా నియ‌మించ‌డాన్ని త‌ప్పుబ‌డుతోంది. ఆధారాల‌ను క‌ప్పిపుచ్చి ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారిని TMC ర‌క్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

Similar News

News February 7, 2026

FEB 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం

image

TG: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలింగ్ రోజైన ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించాలని SEC జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని తెలిపింది. ప్రైవేట్ పరిశ్రమలకూ సెలవు ఇవ్వాలని సూచించారు. ఓటర్లు ఎటువంటి ఆటంకం లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో సెలవు ప్రకటిస్తున్నట్లు SEC వెల్లడించింది.

News February 7, 2026

పాక్‌కు వ్యాక్సిన్ కష్టాలు: భారత్‌తో పెట్టుకుంటే తప్పదు మరి!

image

భారత్‌తో సంబంధాలు చెడగొట్టుకుంటే ఎలా ఉంటుందో పాక్‌కు ఒక్కొక్కటిగా తెలిసొస్తోంది. 2025 మే నాటి సైనిక ఘర్షణల తర్వాత ఇండియా నుంచి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో ఆర్థికంగా భారం పడుతోందని స్వయంగా ఆ దేశ మంత్రి ముస్తఫా వెల్లడించారు. GAVI ద్వారా ఇండియా నుంచి తక్కువ ధరకే టీకాలు పొందిన పాక్ ఇప్పుడు ఏటా $400 మిలియన్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. సొంతంగా వ్యాక్సిన్లు తయారు చేసుకోవడం వారికి తప్పేటట్లులేదు.

News February 7, 2026

KCRపై చర్యలు తీసుకునే దమ్ము లేదా: కిషన్ రెడ్డి

image

TG: KCR అక్రమాలపై చర్యలు తీసుకునే దమ్ము లేకపోతే CM పదవికి రేవంత్ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ‘KCRపై చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారో రేవంత్ చెప్పాలి. చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత CMది కాదా? అధికారంలోకి వచ్చాక KCRకు చిప్పకూడు తినిపిస్తా, దోచుకున్న డబ్బంతా కక్కిస్తా అని అన్నారు. ఇప్పుడు ఆయనపై ఈగ వాలకుండా చూసుకుంటున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో విమర్శించారు.