News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 10, 2026
US-బంగ్లా ట్రేడ్ డీల్.. 1 శాతం సుంకం తగ్గింపు!

అమెరికా, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. టారిఫ్స్ను 20% నుంచి 19%కి అమెరికా కుదించింది. అంటే కేవలం 1% తగ్గించింది. నిజానికి బంగ్లా గూడ్స్పై 37% సుంకాలు విధించాలని మొదట్లో ప్రతిపాదించినా.. తర్వాత 20%కి తగ్గిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు. తాజా డీల్తో US మెటీరియల్స్తో తయారు చేసిన పలు టెక్స్టైల్, అప్పెరల్ గూడ్స్కు జీరో టారిఫ్ యాక్సెస్ దొరుకుతుందని బంగ్లా అడ్వైజర్ యూనస్ ట్వీట్ చేశారు.
News February 10, 2026
నేషనల్ ఆయుష్ మిషన్లో ఉద్యోగాలు

<
News February 10, 2026
ఇతరుల గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారా?

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ||
వివేకవంతులు ఎవరి గురించి అతిగా చింతించరు. ఇతరుల ప్రవర్తన, పరిస్థితులను మార్చలేమని తెలిసి కూడా వారి గురించి ఆలోచించడం వ్యర్థం. దానివల్ల మనశ్శాంతి పోతుంది. వారి కర్మలను మనం మోయలేం. మన చేతుల్లో లేని విషయాల గురించి బాధపడటం అవివేకం. అందుకే అతిగా ఆలోచించి కాలాన్ని వృధా చేసేకంటే, మన ధర్మాన్ని నిర్వర్తించడమే ఉత్తమం. <<-se>>#MSBP<<>>


