News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 18, 2026
యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వేళాయే

TG: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరుకళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూలవిరాట్టుకు నిర్వహించే సహస్ర ఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
News February 18, 2026
కొల్లేటి వ్యవసాయం గొడ్డు వినాశనం

కొల్లేరు సరస్సు పరివాహక ప్రాంతం పల్లపు ప్రదేశం కావడంతో వర్షాకాలంలో వరదలు వచ్చి పంటలు పూర్తిగా మునిగిపోతాయి. దీని వల్ల రైతులు ఎంత పెట్టుబడి పెట్టినా పంట చేతికి రాదు. అలాగే భూముల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల గడ్డి కుళ్లిపోయి, పశువులకు మేత కూడా లభించదు. ఫలితంగా మేత లేక, రోగాల బారిన పడి పశువులు చనిపోతాయి. అందుకే కొల్లేటి వ్యవసాయం అటు పంటను, ఇటు పశుసంపదను కూడా ముంచేస్తుందని ఈ సామెత భావం.
News February 18, 2026
దేవాలయంలో ఏ దానంతో ఏ పుణ్యం?

గుడిలో వస్తురూపేణా చేసే దానాలు విశేష ఫలితాలనిస్తాయి. శంఖం దానంతో పుణ్యలోక ప్రాప్తి, గంట దానంతో కీర్తి, గజ్జెల దానంతో సౌభాగ్యం కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ‘ధ్వజస్తంభంతో యశస్సు, జెండాలతో పాపవిముక్తి, సుగంధ ద్రవ్యాలతో రూప సంపత్తి, పందిళ్లు నిర్మిస్తే ధర్మబుద్ధి కలుగుతాయి. ఇలా ఆలయ అభివృద్ధికి, సౌకర్యాలకు చేసే సాయం భక్తులకు ఇహపర సుఖాలు కలుగుతాయి’ అని విష్ణు ధర్మోత్తర పురాణం చెబుతోంది.


