News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News January 31, 2026
సంజూకి జరిగిన అన్యాయమిది: ఇర్ఫాన్ పఠాన్

NZతో జరుగుతున్న T20 సిరీస్లో సంజూ శాంసన్ వరుసగా ఫెయిలవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. బాగా ఆడుతున్న టైమ్లో సంజూను సడన్గా మిడిల్ ఆర్డర్కు పంపడం అన్యాయమని, అతనికి స్థిరమైన పొజిషన్ ఇవ్వాలని పఠాన్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ సంజూ ఫామ్ అందుకోలేకపోతే అతని స్థానంలో ఇషాన్ను తీసుకోవడం సరైన నిర్ణయమన్నారు. సంజూకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్నారు.
News January 31, 2026
జనసేన MLA శ్రీధర్పై NHRCకి వీణ ఫిర్యాదు

AP: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపిన జనసేనకు చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణల వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు వీణ ఫిర్యాదు చేశారు. వీణ తరఫున న్యాయవాది అజాద్ NHRCలో ఈ కేసు పెట్టారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని విచారణకు స్వీకరించింది.
News January 31, 2026
పోస్టాఫీసుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టాఫీసుల్లో GDS పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి ఫిబ్రవరి 14వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తులను ఫిబ్రవరి 2 – ఫిబ్రవరి 16 వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో BPM, ABPM పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్సైట్: https://indiapost.gov.in/


