News August 14, 2024

టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

image

బెంగాల్‌లో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం ఘ‌ట‌నపై అధికార టీఎంసీని విప‌క్ష‌ బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్ర‌భుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ఆర్జీ కర్ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్‌ను మ‌రో కాలేజీకి ప్రిన్సిప‌ల్‌గా నియ‌మించ‌డాన్ని త‌ప్పుబ‌డుతోంది. ఆధారాల‌ను క‌ప్పిపుచ్చి ప‌లుకుబ‌డి క‌లిగిన‌వారిని TMC ర‌క్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.

Similar News

News February 19, 2026

రాష్ట్రంలో ఎల్లుండి నుంచి వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ నెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావంతో ఈ నెల 21 నుంచి 3 రోజులపాటు రాయలసీమలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 22వ తేదీ నుంచి 2 రోజులపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పడతాయని చెప్పింది. రానున్న 24 గంటల్లో కోస్తాలోని పలు జిల్లాల్లో పొగ మంచు కురుస్తుందని, ఎండ స్వల్పంగా పెరుగుతుందని పేర్కొంది.

News February 19, 2026

దోసకాయ బంగారమాయె.. రష్యాలో కిలో రూ.355

image

నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా రష్యాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దోసకాయలు కిలో 300 రూబల్స్(₹355) చొప్పున అమ్ముతున్నారని, కొన్నిచోట్ల 2, 3 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నెటిజన్లు వాపోతున్నారు. ప్రస్తుతం మాంసంతో సమానంగా ధర ఉంటోందని చెబుతున్నారు. దోసకాయలే ఇప్పుడు తమకు బంగారంలా మారాయని సెటైర్లు వేస్తున్నారు.

News February 19, 2026

బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

image

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.