News August 14, 2024
టీఎంసీని టార్గెట్ చేసిన బీజేపీ

బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై అధికార టీఎంసీని విపక్ష బీజేపీ టార్గెట్ చేసింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం నిజాలను దాస్తోందని ఆరోపించింది. కేసు విచారణ జరుగుతుండగానే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా నియమించడాన్ని తప్పుబడుతోంది. ఆధారాలను కప్పిపుచ్చి పలుకుబడి కలిగినవారిని TMC రక్షిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
Similar News
News February 5, 2026
గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: CM

TG: గ్రూప్ -1 నియామకాలపై హైకోర్టు <<19055465>>తీర్పును<<>> స్వాగతిస్తున్నట్లు CM రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఎన్ని కుట్రలు పన్ని ఉద్యోగ నియామకాలను అడ్డుకోవాలని చూసినా వాటిని ఛేదించి న్యాయ పోరాటంలో గెలిచాం. 563 మంది గ్రూప్-1 అభ్యర్థులకు అభినందనలు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి గ్రూప్-1 అధికారులుగా మీరు నియమితులయ్యారు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News February 5, 2026
ఈ ఫుడ్స్తో ఎనర్జీ పెరిగిపోతుంది

కొన్ని రకాల ఆహారపదార్థాలను తక్కువ మోతాదులో తీసుకున్నా శరీరానికి ఎక్కువ శక్తి అందుతుందంటున్నారు నిపుణులు. అవేంటంటే.. ఎండు ద్రాక్ష, బాదం, వేరుశెనగ, ఖర్జూరం, జీడిపప్పు, నెయ్యి, కొబ్బరి, అరటి పళ్లు, అవకాడో. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు కేలరీలు, పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలను నీరసంగా అనిపించినపుడు తింటే తక్షణ శక్తి అందుతుందని చెబుతున్నారు.
News February 5, 2026
42 ఏళ్ల పాటు నిరీక్షణ.. 100 ఏళ్ల వృద్ధుడికి దక్కిన న్యాయం

42 ఏళ్ల క్రితం అరెస్ట్ అయిన ఓ వృద్ధుడికి (100 Yrs) ఎట్టకేలకు న్యాయం దక్కింది. 1982లో జరిగిన ఓ హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ధనీరామ్ను అలహాబాద్ HC నిర్దోషిగా ప్రకటించింది. ఆయన చేసిన అప్పీల్ 4 దశాబ్దాల పాటు పెండింగ్లోనే ఉండిపోయింది. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం, విచారణలో లోపాలతో పాటు వయసుని పరిగణనలోకి తీసుకుంది. ఈ తీర్పుతో న్యాయవ్యవస్థలో జాప్యంపై చర్చ జరిగే అవకాశం ఉంది.


