News March 6, 2025
ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా

ఉత్తర తెలంగాణలో బీజేపీ పట్టు నిలుపుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు గెలిచింది. 2024 ఎంపీ ఎన్నికల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ సొంతం చేసుకుంది. తాజాగా ఆదిలాబాద్-నిజామాబాద్-కరీంనగర్-మెదక్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలు సైతం తన ఖాతాలో వేసుకుంది. దీన్ని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణలో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది.
Similar News
News March 4, 2026
మే 18 నుంచి ఆటల పోటీలు.. జాబ్ మేళాలు!

TG: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా యువత కోసం ప్రభుత్వం మే 18 – 23 మధ్య ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనుంది. హెల్త్ అవేర్నెస్ కోసం 18న మండల స్థాయిలో 5కే మారథాన్, 2కే వాకథాన్, యోగా తరగతులు నిర్వహిస్తారు. 19న ఉద్యోగావకాశాలపై అవగాహన, 20న జిల్లా స్థాయిలో జాబ్ మేళాలు నిర్వహిస్తారు. 21న ఆటల పోటీలు, 22న స్వచ్ఛతపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇక 23న 50 మందితో యూత్ పార్లమెంట్ నిర్వహించనుంది.
News March 4, 2026
టాప్ సెల్లింగ్ కార్గా డిజైర్!

కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ డామినేషన్ కొనసాగుతోంది. FY26లో APR – FEB మధ్య టాప్ 10 సెల్లింగ్ కార్స్ లిస్ట్లో ఈ సంస్థకు చెందినవే ఆరు కార్లు ఉన్నాయి. డిజైర్, ఎర్టిగా, స్విఫ్ట్, బ్రీజా, వ్యాగన్ ఆర్, ఫ్రాంక్స్ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇప్పటికే 2,07,906 యూనిట్ల అమ్మకంతో డిజైర్ FY26లో అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా నిలవనుంది. ఇక డిజైర్ తర్వాత అత్యధిక సేల్స్ నమోదు చేసిన కారుగా టాటా నెక్సాన్ ఉంది.
News March 4, 2026
ఇరాన్ కొత్త సుప్రీంలీడర్గా ఖమేనీ కుమారుడు!

అయతొల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీంలీడర్గా ఎన్నికైనట్లు ఆ దేశ మీడియా సంస్థ ఇరాన్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. మొజ్తాబా ఖమేనీని సుప్రీంలీడర్గా ఎన్నుకోవాలని IRGC ఆ దేశ మతపెద్దలను ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఖమేనీ కార్యకలాపాల్లో మొజ్తాబా కీలక పాత్ర పోషించారు. మరోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో మొజ్తాబాకు ఎంతోకాలంగా క్లోజ్ రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.


