News April 11, 2024
ప్రచారాన్ని చూసేందుకు 25 దేశాలకు బీజేపీ ఆహ్వానం

లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ప్రచార తీరును చూసేందుకు బీజేపీ 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. అందుకు జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి 13 దేశాల్లోని పార్టీలు సానుకూలంగా స్పందించాయి. త్వరలో భారత్కు రానున్న ఆయా దేశాల పార్టీల ప్రతినిధులు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ప్రచారాలను చూడనున్నారు. అమెరికాలోనూ అధ్యక్ష ఎన్నికలు ఉండటంతో అక్కడి పార్టీలను బీజేపీ ఆహ్వానించలేదు.
Similar News
News October 26, 2025
జూబ్లీహిల్స్లో ‘కారు’ను పోలిన ఫ్రీ సింబల్స్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRSకు ఫ్రీ సింబల్స్తో తిప్పలు తప్పేలా లేవు. ఇండిపెండెంట్లకు EC కెమెరా, చపాతీ రోలర్, రోడ్ రోలర్, సోప్ డిష్, టీవీ, షిప్ వంటి ఫ్రీ సింబల్స్ కేటాయించింది. ఇవి కారును పోలి ఉంటాయనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో నెలకొంది. ఇలాంటి ఫ్రీ సింబల్స్ తొలగించాలని BRS ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయితే ఈసారి అభ్యర్థి ఫొటో కూడా ఉండనుండటంతో ఈ ‘సింబల్ కన్ఫ్యూజన్’ అంతగా ఉండకపోవచ్చు.
News October 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: ఇంటర్ విద్యార్థులు తమ పేరు, గ్రూప్, మీడియం తదితర వివరాలను చెక్ చేసుకునేందుకు ఇంటర్ విద్యా మండలి అవకాశం కల్పించింది. <
News October 26, 2025
ఎర పంటల వల్ల వ్యవసాయంలో లాభమేంటి?

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.


