News March 25, 2024

బీజేపీ నా రక్తంలోనే ఉంది: గాలి జనార్దన్

image

కర్ణాటక మాజీ మంత్రి, కళ్యాణ రాజ్యప్రగతి పార్టీ అధినేత గాలి జనార్దన్ రెడ్డి BJPలో చేరారు. బెంగళూరులో మాజీ CM యడ్యూరప్ప, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. తన KRPP పార్టీని BJPలో విలీనం చేస్తున్నట్లు జనార్దన్ ప్రకటించారు. BJPలో చేరడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆయన.. BJP అనేది తన రక్తంలోనే ఉందన్నారు. మూడోసారి మోదీ ప్రధాని అయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News April 6, 2026

డ్రైవింగ్ లైసెన్స్ జారీకి త్వరలో కొత్త నిబంధన!

image

TG: డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు త్వరలో రోడ్ సేఫ్టీ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి వీటి కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక వచ్చాక కొత్త రూల్ అమల్లోకి వచ్చే అవకాశముంది.

News April 6, 2026

IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News April 6, 2026

లేఆఫ్స్‌ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

image

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.