News June 4, 2024
గుజరాత్లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే లీడింగ్

గుజరాత్లో బీజేపీ మొత్తం 26 స్థానాల్లో లీడింగ్లో దూసుకెళ్తున్నాయి. తమిళనాడులో డీఎంకే 14, కాంగ్రెస్ 5 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. మహారాష్ట్రలో 7 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో, సేన 4, NCP SP 3, SS UBT 6 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నాయి. అటు కర్ణాటకలో 8 చోట్ల బీజేపీ, 7 చోట్ల INC, 2 చోట్ల JDS, కేరళలో 16 స్థానాల్లో UDF, 4 స్థానాల్లో LDF ఆధిక్యంలో ఉన్నాయి.
Similar News
News January 24, 2026
డెయిరీ ఫామ్ ప్రారంభించే ముందు ఇవి చేయాలి

డెయిరీ ఫామ్ ప్రారంభానికి ముందు కొంత భూమిలో నేపియర్, గినీ గడ్డి, జొన్న.. మరి కొంత భూమిలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ పశుగ్రాసాలను సాగుచేయాలి. సుబాబుల్, అవిసె చెట్లను ఫామ్ పెట్టే స్థలం చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్లు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలంటున్నారు నిపుణులు. అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట క్లిక్ <<>>చేయండి.
News January 24, 2026
IRELలో 30 పోస్టులకు నోటిఫికేషన్

కేరళలోని ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (<
News January 24, 2026
రథసప్తమి నాడు అర్ఘ్యం ఎలా సమర్పించాలంటే..?

సూర్యునికి అత్యంత ప్రీతిపాత్రమైనది అర్ఘ్యం. రథసప్తమి నాడు రాగి పాత్రలోని శుద్ధ జలంలో ఎర్ర పూలు, రక్తచందనం, అక్షతలు కలిపి సూర్యునికి నమస్కరించాలి. శివపురాణంలోని మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. ఆవు పాల క్షీరాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. దీనివల్ల సూర్యుడు ప్రసన్నుడవుతాడని నమ్మకం. ఇలా అర్ఘ్య ప్రదానం చేస్తే ఆయురారోగ్యాలు, కంటి చూపు మెరుగుపడి విశేష తేజస్సు లభిస్తుందని మన శాస్త్రం చెబుతోంది.


