News November 16, 2024
KTR అరెస్ట్ని బీజేపీ అడ్డుకోవడం లేదు: కిషన్ రెడ్డి

TG: KTR అరెస్ట్ని BJP అడ్డుకుంటోందన్న విమర్శలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన KTR కేంద్ర మంత్రులెవరినీ కలవలేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఏ ఫైల్పై సంతకం పెడుతున్నారనేది కేంద్రం పర్యవేక్షించదని వెల్లడించారు. మాజీ సీఎం KCR తరహాలోనే CM రేవంత్ రెడ్డి కూడా దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. అబద్ధపు, అరాచక పాలన కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.
Similar News
News November 14, 2025
HYD: ఉ.11.30 గంటల్లోపే విజేతపై క్లారిటీ!

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో కౌంటింగ్ చేపట్టనుండగా మొదటి గంటన్నరలోపే ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. ముందు పోస్టల్ బ్యాలెట్ ఆ తర్వాత EVMలలోని ఓట్లను లెక్కించనున్నారు. ఉ.11.30లోపు విజేత ఎవరో క్లారిటీ రావొచ్చని అంచనా. గెలుపుపై అధికార కాంగ్రెస్తోపాటు ప్రతిపక్ష BRS ధీమా ఉండగా పట్టు నిలుపుకునేందుకు BJP చూస్తోంది.
News November 14, 2025
CSKకి సంజూ శాంసన్!

స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్ను ఐపీఎల్ ఫ్రాంచైజీ CSK ట్రేడ్ చేసుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి రాజస్థాన్ రాయల్స్తో పేపర్ వర్క్ పూర్తయిందని వెల్లడించాయి. ఇక అధికారిక ప్రకటన రావడమే తరువాయి అని పేర్కొన్నాయి. అటు జడేజాను వదులుకోవట్లేదని సమాచారం. మరోవైపు శాంసన్ వచ్చే సీజన్లో ఎల్లో జెర్సీలో కనిపిస్తారని CSK ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆయనకు వెల్కమ్ చెబుతూ పోస్టులు చేస్తున్నారు.
News November 14, 2025
నేడు ఈ అమ్మవారిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు

లక్ష్మీదేవి విగ్రహాల్లో వ్యూహలక్ష్మి ప్రతిమను దర్శించుకుంటే భక్తులకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ దివ్య రూపం తిరుమల శ్రీవారి వక్షస్థలంలో కొలువై ఉంటుంది. స్వామివారి సమస్త జగత్తును పాలించే పరాశక్తి స్వరూపాన్ని హృదయంలో ధ్యానించడం వలన అఖండమైన ఐశ్వర్యంతో పాటు, ధైర్యం, జ్ఞానం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధించి, సమస్త దోషాలు తొలగిపోతాయట. ఈ రూపంలో అమ్మను ‘త్రిభుజా’ అని పిలుస్తారు.


