News June 4, 2024

ఢిల్లీలో దూసుకెళ్తున్న బీజేపీ

image

దేశ రాజధాని పరిధిలోని 7 ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీలో అధికార పార్టీగా ఉన్న ఆప్ కనీసం ఒక్క చోట కూడా లీడ్ కనబర్చడం లేదు. కేజ్రీవాల్ ఎన్నికల ముందు బెయిల్‌పై బయటకు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేదు అన్పిస్తోంది.

Similar News

News October 9, 2024

వరద సాయంపై జగన్ విష ప్రచారం: లోకేశ్

image

AP: వరద బాధితులకు ప్రభుత్వ సహాయక చర్యలపై జగన్ విష ప్రచారం చేస్తున్నారని మంత్రి లోకేశ్ మండిపడ్డారు. అగ్గిపెట్టెలు, కొవ్వత్తులకు రూ.23 లక్షలు సైతం ఖర్చు కాకున్నా రూ.23 కోట్లు అయినట్లు ఫేక్ ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. తమ పాలనలో ప్రతి లెక్క పారదర్శకంగా ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు వరద బాధితులకు జగన్ ప్రకటించిన రూ.1 కోటిలో ఇంతవరకు ఒక్క రూపాయైనా ఇవ్వలేదని లోకేశ్ చురకలంటించారు.

News October 9, 2024

హైదరాబాద్‌లో ఉద్రిక్తత.. MRPS ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

image

TG: HYDలోని పార్శీగుట్ట ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్సీ వర్గీకరణ చేయకుండా డీఎస్సీ ఉద్యోగాలను భర్తీ చేయడంపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణతో పాటు నేతలు నిరసనకు దిగారు. పార్శీగుట్ట నుంచి ట్యాంక్ బండ్ వరకు ర్యాలీగా బయలుదేరగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

News October 9, 2024

ఆ వార్డులో YCPకి ఒక్క ఓటు.. ఇదెలా సాధ్యం: VSR

image

AP: హరియాణా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో APని ప్రస్తావిస్తూ MP విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలప్పుడు తొలి 4దశల్లో జరిగిన పోలింగ్‌లో BJPకి ఎదురుగాలి వీచింది. ఐదు, ఆరు దశల్లో, APలో జరిగిన ఎన్నికల్లో EVMల ట్యాంపరింగ్ చేశారు. CBN కుట్ర ఇది. హిందూపురంలో ఓ వార్డులో YCPకి ఒక్క ఓటు వచ్చింది. ఇది సాధ్యమా? ఈ మోసాలను కప్పిపుచ్చడానికి తిరుమల లడ్డూ వివాదం తెరపైకి తెచ్చారు’ అని ఆరోపించారు.