News December 17, 2024

20 మంది పార్టీ ఎంపీల‌కు బీజేపీ నోటీసులు!

image

జ‌మిలి ఎన్నిక‌ల బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నుండడంతో పార్టీ ఎంపీల‌కు బీజేపీ సోమ‌వారం విప్ జారీ చేసింది. అయితే, మంగ‌ళ‌వారం స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్ట‌డంపై జ‌రిగిన ఓటింగ్‌కు 20 మంది ఎంపీలు గైర్హాజ‌ర‌య్యారు. దీంతో విప్‌ను ధిక్క‌రించిన స‌భ్యులంద‌రికీ నోటీసులు ఇవ్వాల‌ని పార్టీ అధిష్ఠానం నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. కీల‌క స‌మ‌యంలో స‌భ‌కు రాక‌పోవ‌డంపై పార్టీ పెద్ద‌లు ఆగ్రహంగా ఉన్నట్టు స‌మాచారం.

Similar News

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

పాలు పితికే సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

పాలు పితకడానికి ముందు గేదె/ఆవు పొదుగు, చనులను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పాలు పితికే వ్యక్తి చేతులకు గోళ్లు ఉండకూడదు. చేతులను బాగా కడుక్కొని పొడిగుడ్డతో తుడుచుకున్నాకే పాలు తీయాలి. పొగ తాగుతూ, మద్యం సేవించి పాలు పితక వద్దు. పాల మొదటి ధారల్లో సూక్ష్మక్రిములు ఉంటాయి. అందుకే వేరే పాత్ర లేదా నేలపై తొలుత పిండాలి. పాలను సేకరించే పాత్రలను శుభ్రంగా ఉంచకపోతే తీసిన పాలు త్వరగా చెడిపోతాయి.

News September 18, 2025

మహిళా వ్యాపారవేత్తల కోసం ట్రెడ్ స్కీమ్

image

మహిళల సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అందులో ఒకటే ట్రెడ్. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. ఇందులో మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్‌ కింద అందజేస్తుంది. మొత్తం రూ.30 లక్షల వరకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి.