News June 25, 2024
ఎంపీలకు బీజేపీ త్రీ లైన్ విప్ జారీ

రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉండటంతో పార్టీ ఎంపీలందరూ తప్పక హాజరుకావాలని బీజేపీ త్రీ లైన్ విప్ జారీ చేసింది. కాగా NDA నుంచి ఓం బిర్లా, ఇండియా కూటమి నుంచి కె.సురేశ్ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేశారు. రేపు స్పీకర్ను ఎన్నుకోనున్నారు. మరోవైపు వైసీపీ ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 10, 2025
అంతర పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

దీర్ఘకాలిక పంటల మధ్య.. స్వల్పకాలిక పంటలను అంతర పంటలుగా వేసుకోవాలి. పప్పు జాతి రకాలను సాగు చేస్తే పోషకాలను గ్రహించే విషయంలో పంటల మధ్య పోటీ ఉండదు. ప్రధాన పంటకు ఆశించే చీడపీడలను అడ్డుకునేలా అంతరపంటల ఎంపిక ఉండాలి. ప్రధాన, అంతర పంటలపై ఒకే తెగులు వ్యాపించే ఛాన్సుంటే సాగు చేయకపోవడం మేలు. చీడపీడల తాకిడిని దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలి. సేంద్రియ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడి పొందవచ్చు.
News December 10, 2025
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News December 10, 2025
మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT


