News April 6, 2024

మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు: రేవంత్

image

TG: జూన్ 9న ఢిల్లీలో మువ్వన్నెల జెండా ఎగరాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘BRSను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో.. బీజేపీని అలాగే ఓడించాలి. ఇదే పట్టుదలతో పని చేయాలి. గుజరాత్ మోడల్ మీద వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తుంది. మతాల మధ్య బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారు. తెలంగాణ మునిగినప్పుడు సిగ్గులేని కిషన్ రెడ్డి కేంద్రం నుంచి రూపాయి కూడా తేలేదు. అందుకే బీజేపీకి ఓటేయాలా?’ అని మండిపడ్డారు.

Similar News

News October 20, 2025

ఆత్మగౌరవమే కిరీటం! నీ లక్ష్యం కోసం కష్టపడు..

image

మిత్రమా.. ఆత్మగౌరవమే నీకు అసలైన కిరీటం. నిన్ను పట్టించుకోని వారి కోసం అస్సలు వెతకకుండా నిన్ను నువ్వు గౌరవించుకో. అవమానం జరిగితే నిశ్శబ్దంగా ఉండకుండా వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పేసేయ్. నీకు సంతోషాన్ని ఇచ్చే పనులనే చెయ్యి. ఇతరుల గురించి మాట్లాడి సమయాన్ని వృథా చేయకుండా, నీ లక్ష్యాల కోసం కష్టపడు. నీ సమయం ఎంతో విలువైనదిగా భావించు. ఎప్పుడూ బిజీగా ఉండి నీ విలువను పెంచుకో! Share it

News October 20, 2025

దీపంలోని దేవతలు.. మన కర్మలకు సాక్షిభూతులు

image

దీపం.. మన జీవితంలో ఓ భాగం. రోజూ ఉభయ సంధ్యలలో ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీప ప్రజ్వలన చేసిన తర్వాతే పండుగలు, పూజలు, శుభకార్యాలు, వేడుకలు ప్రారంభిస్తాము. వివాహాలనూ అగ్నిసాక్షిగా చేసుకుంటాం. దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉండి అనుగ్రహిస్తారని నమ్మకం. అందుకే దీపం వెలిగించటం అత్యంత ప్రధానమైనది. ఈ విషయం అందరికీ తెలియజేయడానికి దీపావళి పండగను మహర్షులు ఏర్పాటు చేశారని ఓ విశ్వాసం.

News October 20, 2025

దీపావళి శుభాకాంక్షలు చెప్పిన పాక్ PM.. నెటిజన్ల ఫైర్

image

ప్రపంచంలోని హిందువులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఈ పండుగ చీకటిని పారదోలి, సామరస్యాన్ని పెంపొందించి, శాంతి, కరుణ, శ్రేయస్సు వైపు మనల్ని నడిపించాలని పేర్కొన్నారు. కాగా పహల్గాంలో హిందువులను చంపి ఇప్పుడు విషెస్ చెబుతారా అంటూ భారత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్‌లో హిందువులు, సిక్కులను ఒక పద్ధతి ప్రకారం చంపారని మండిపడుతున్నారు.