News November 27, 2024
ప్రధాని మోదీని కలిసిన BJP నేతలు

TG: రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. అందరినీ ఆయన ప్రేమతో ఆప్యాయంగా పలకరించారు. అందరూ బాగున్నారా అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో నేతలు కలసి మెలసి పని చేయాలని ఆయన సూచించారు. మోదీని కలిసిన వారిలో విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, రాజా సింగ్, ఈటల రాజేందర్, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News October 31, 2025
భారత్లో టెస్లా, స్టార్లింక్ నియామకాలు

ఎలాన్ మస్క్కు చెందిన EV కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించే ‘స్టార్లింక్’ భారత్లో ఉద్యోగ నియామకాలు ప్రారంభించాయి. ముంబై, పుణే, ఢిల్లీ కేంద్రంగా పనిచేసేందుకు నిపుణుల కోసం టెస్లా ప్రకటన ఇచ్చింది. ఇందులో సప్లై చైన్, బిజినెస్ సపోర్ట్, AI, HR తదితర విభాగాలున్నాయి. అలాగే ఫైనాన్స్, అకౌంటింగ్ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బెంగళూరులో పనిచేయాలని స్టార్లింక్ పేర్కొంది.
News October 31, 2025
సుశాంత్ను ఇద్దరు కలిసి చంపారు: సోదరి శ్వేతా సింగ్

2020లో జరిగిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణంపై సోదరి శ్వేతా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ది ఆత్మహత్య కాదని, ఇద్దరు కలిసి హత్య చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని US, ముంబైలోని ఇద్దరు సైకిక్స్ వేర్వేరుగా తనకు చెప్పారన్నారు. ‘సుశాంత్ బెడ్, ఫ్యాన్ మధ్య దూరాన్ని బట్టి అతను ఉరేసుకుని చనిపోయే అవకాశమే లేదు. మెడపై దుపట్టా మార్క్ కాకుండా ఒక చిన్న చెయిన్ ముద్ర మాత్రమే కనిపించింది’ అని పేర్కొన్నారు.
News October 31, 2025
గడువులోగా అమరావతి పనులు పూర్తి కావాలి: CBN

AP: రాజధాని అమరావతి పనులను నిర్దేశించిన సమయానికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని, అదే సమయంలో నాణ్యతలో ఎక్కడా రాజీపడరాదని స్పష్టం చేశారు. సీఆర్డీఏ ప్రాజెక్టులపై మంత్రి నారాయణ, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాజధాని పరిధిలో ఇప్పటివరకు చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.


