News April 7, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
Similar News
News October 16, 2025
స్మృతి, అభిషేక్కు ICC POTM అవార్డ్స్

సెప్టెంబర్కు గాను ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్స్ ఇండియన్ ఓపెనర్స్ను వరించాయి. మెన్స్ విభాగంలో అభిషేక్ శర్మ, ఉమెన్స్ విభాగంలో స్మృతి మంధాన ఎంపికయ్యారు. గత నెల ఆసియా కప్లో అద్భుత ప్రదర్శనతో కుల్దీప్, బెన్నెట్(ZIM)ను వెనక్కినెట్టి అభిషేక్ అవార్డు సాధించారు. అటు స్మృతి SEPలో 77 Avgతో 308 రన్స్ చేసి పాక్ ప్లేయర్ సిద్రా, SA స్టార్ టాజ్మిన్ బ్రిట్స్ను వెనక్కినెట్టి అవార్డు సొంతం చేసుకున్నారు.
News October 16, 2025
AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు సుప్రీంలో పిటిషన్

అహ్మదాబాద్లో 260 మందికి పైగా మరణించిన AI విమాన ప్రమాదంపై న్యాయ విచారణకు ఆ ఫ్లైట్ కెప్టెన్ సుమీత్ తండ్రి పుష్కర్ సభర్వాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. AAIB దర్యాప్తు సరిగా లేదని, పైలెట్ల లోపం వల్లే ప్రమాదం అన్న రీతిలో దాని ప్రాథమిక నివేదిక ఉందని తప్పుబట్టారు. ఆ దర్యాప్తును నిలిపి, న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో నిపుణులతో స్వతంత్ర విచారణ జరపాలని కోరారు. ఆయనతో పాటు FIP కూడా కోర్టులో పిటిషన్ వేసింది.
News October 16, 2025
రాష్ట్ర బంద్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు: TPCC చీఫ్

ఈ నెల 18న BC సంఘాలు చేపట్టే తెలంగాణ బంద్కు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రిజర్వేషన్లపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే బంద్కు BRS, BJP, మావోయిస్టు పార్టీలు సపోర్ట్ తెలపగా తాజాగా అధికార పక్షమూ మద్దతు ప్రకటించింది. దీంతో ఎల్లుండి బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉంటుందని స్పష్టమవుతోంది. విద్యాసంస్థలకు యాజమాన్యాలు రేపు చెప్పే అవకాశముంది.
Share It