News June 16, 2024
కాంగ్రెస్ చీఫ్ను కలిసిన బీజేపీ మంత్రి

బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 11న ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఇంటికి వెళ్లి కలిశారు. ఇదిలా ఉంటే ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల్లో భాగంగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది. జూలై 22న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News September 14, 2025
తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు!

AP: గుంటూరు రూరల్(M) తురకపాలెం పరిసరాల్లో యురేనియం అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నై ల్యాబ్లో చేసిన నీటి పరీక్షల్లో గుర్తించినట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రాన్షియం అనే ఎలిమెంట్, ఈకొలి బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నీటిని తాగడం వల్లే స్థానికులు అనారోగ్యం బారిన పడినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.
News September 14, 2025
HDFC బ్యాంకు సేవలకు అంతరాయం!

HDFC బ్యాంకు సేవలకు అంతరాయం కలుగుతోంది. UPI ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నామని చాలామంది వినియోగదారులు రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకోలేకపోతున్నామని చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై బ్యాంక్ ఇంకా స్పందించలేదు. మీకు ఈ సమస్య ఎదురైందా? COMMENT
News September 14, 2025
BELలో ఇంజినీర్ పోస్టులు

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<