News June 6, 2024
రాహుల్కు బీజేపీ ఎంపీ కౌంటర్

మోదీ, షా స్టాక్ మార్కెట్ల స్కాంకు పాల్పడ్డారన్న రాహుల్ <<13392703>>వ్యాఖ్యల<<>>కు బీజేపీ ఎంపీ పియూష్ గోయల్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందనే భయంతో స్టాక్ మార్కెట్ పడిపోయిందని అన్నారు. తిరిగి మోదీ ప్రభుత్వమే రావడంతో కుదురుకుంటోందని చెప్పారు. మరోవైపు కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మహిళకు రూ.లక్ష ఇస్తామనే హామీని ఎప్పుడు నెరవేరుస్తారంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారని దుయ్యబట్టారు.
Similar News
News September 14, 2025
ఏపీ వైద్యారోగ్యశాఖలో 538 పోస్టులు

<
News September 14, 2025
డయేరియా బాధితుల ఇళ్లకే హైజీన్ కిట్లు

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. నిన్న బాధితులను మంత్రి నారాయణ పరామర్శించి అధికారులకు <<17697179>>ఆదేశాలు<<>> జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఇంటికి హైజీన్ కిట్లు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. ‘డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సహాయం కోసం 91549 70454కు కాల్ చేయండి’ అని సూచించారు.
News September 14, 2025
యానిమల్ లవర్స్పై ప్రధాని మోదీ సెటైర్లు

ఢిల్లీలో ఇటీవల వీధి కుక్కల తరలింపును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యానిమల్ లవర్స్ ఉద్యమించిన విషయం తెలిసిందే. వారి డబుల్ స్టాండర్డ్స్పై ప్రధాని మోదీ రీసెంట్గా ఓ ఈవెంట్లో సెటైర్లు వేశారు. ‘నేను ఇటీవల కొంతమంది యానిమల్ లవర్స్ను కలిశాను. మన దేశంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వారిలో ఎక్కువ మంది ఆవులను యానిమల్గా పరిగణించరు’ అని వ్యాఖ్యానించారు.