News November 23, 2024
ఓట్లు పెరిగితే BJP+ సీట్లు పెరుగుతాయ్!

మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజీ పెరిగేకొద్దీ NDA సీట్లు పెరుగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.4 ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 65%కు చేరుకుంది. 2024 లోక్సభ పోలింగ్ 61%తో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. మహారాష్ట్రలో BJP 9, శివసేన 7, NCP 1 సీటే గెలిచాయి. కాంగ్రెస్ 13, SSUBT 9, NCPSP 8 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ లెక్కన MVAకు 153, NDAకు 126 రావాలి. అయితే ఇప్పుడు NDA 220 సీట్లు గెలిచేలా ఉంది.
Similar News
News December 25, 2025
ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.
News December 25, 2025
శివుడిగా పూజలందుకున్న తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారు ఒకప్పుడు శివుడిగా పూజలందుకున్నారని చాలామందికి తెలిసుండదు. మూలవిరాట్టుకు ఉన్న జటలు, నాగభూషణాలు చూసి భక్తులు ఆయనను ఈశ్వరుడిగా భావించేవారు. రామానుజాచార్యులు నిర్వహించిన పరీక్షలో శ్రీవారు శంఖుచక్రాలు ధరించి అది వైష్ణవ రూపమని నిరూపించారు. తిరుమల ఆలయానికి రుద్రుడు క్షేత్రపాలుడిగా ఉండటం హరిహర అద్వైతానికి, శైవ వైష్ణవ సామరస్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News December 25, 2025
నేటితో ముగియనున్న సుపరిపాలన యాత్ర

AP: మాజీ PM వాజ్ పేయి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో చేపట్టిన అటల్-మోదీ సుపరిపాలన యాత్ర నేటితో ముగియనుంది. ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమైన యాత్రను రాజధాని అమరావతిలో ముగించనున్నారు. ఈ సందర్భంగా అమరావతిలోని అటల్ స్మృతివనంలో 11amకు అటల్ కాంస్య విగ్రహాన్ని CM CBN ఆవిష్కరిస్తారు. BJP ముఖ్యనేతలు హాజరుకానున్నారు. స్మృతివనానికి N4, E4 రోడ్డు జంక్షన్లో 2.33ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.


