News July 5, 2024
8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: సోమువీర్రాజు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720168861982-normal-WIFI.webp)
AP: రాజమండ్రి వేదికగా ఈ నెల 8న BJP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత సోము వీర్రాజు వెల్లడించారు. పార్టీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 2,250 మంది నేతలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం దందాను బయటపెట్టిన మంత్రి నాదెండ్లను అభినందించారు.
Similar News
News July 8, 2024
OTTలోకి వచ్చేస్తున్న విజయ్ సేతుపతి సినిమా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720420067702-normal-WIFI.webp)
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన 50వ చిత్రం ‘మహారాజ’ ఈ నెల 12న ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది. కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
News July 8, 2024
కోపా అమెరికా: బ్రెజిల్కు షాక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416640678-normal-WIFI.webp)
కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 16 టీమ్స్ పాల్గొనగా నాలుగు జట్లు సెమీస్ చేరాయి. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో బ్రెజిల్పై పెనాల్టీ షూటౌట్లో 4-2 గోల్స్ తేడాతో ఉరుగ్వే నెగ్గింది. అర్జెంటీనా, కెనడా, ఉరుగ్వే, కొలంబియా సెమీస్ చేరాయి. విజేతగా నిలిచిన జట్లు ఈ నెల 15న ఫైనల్ ఆడనున్నాయి. ఓడిన జట్లు ఈ నెల 14న మూడో స్థానం కోసం పోటీ పడతాయి.
News July 8, 2024
ప్రతి తిరస్కరణ ఆశీర్వాదం అని తెలుసుకుంటారు: ప్రశాంత్ వర్మ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720416120449-normal-WIFI.webp)
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అసంతృప్తితో చేసిన ట్వీట్ వైరలవుతోంది. ‘ప్రతి తిరస్కరణ ఓ ఆశీర్వాదం అని మీరు ఒక రోజు తెలుసుకుంటారు’ అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది కచ్చితంగా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ను ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ తన తదుపరి చిత్రం ‘రాక్షసుడు’ను రణ్వీర్తో తీయాలనుకోగా.. విభేదాలు రావడంతో తాజాగా క్యాన్సల్ అయిన విషయం తెలిసిందే.