News July 5, 2024
8న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: సోమువీర్రాజు

AP: రాజమండ్రి వేదికగా ఈ నెల 8న BJP రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేత సోము వీర్రాజు వెల్లడించారు. పార్టీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 2,250 మంది నేతలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధే అజెండాగా చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన రేషన్ బియ్యం దందాను బయటపెట్టిన మంత్రి నాదెండ్లను అభినందించారు.
Similar News
News April 1, 2026
మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్మీట్లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.
News April 1, 2026
టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News April 1, 2026
IPL: శ్రేయస్ అయ్యర్కు ఫైన్

IPL-19 సీజన్లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.


