News June 29, 2024
8న బీజేపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం: పురందీశ్వరి

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపు 10వేలకుపైగా శక్తి కేంద్రాల్లో ‘మన్ కీ బాత్’ నిర్వహించాలని బీజేపీ స్టేట్ చీఫ్ పురందీశ్వరి ఆ పార్టీ నేతలకు సూచించారు. ఆయా సెంటర్లలో మోదీ ప్రసంగం వినేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాజమండ్రి వేదికగా జులై 8న బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ భేటీలో పార్టీ బలోపేతం దిశగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


