News June 4, 2024

ఒడిశాలో అధికారం దిశగా బీజేపీ!

image

ఒడిశా అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ మొత్తం 147 స్థానాలుండగా బీజేపీ 47 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. అధికార బీజేడీ 28 స్థానాల్లో, కాంగ్రెస్ 6, సీపీఐ(ఎం) 1, స్వతంత్ర అభ్యర్థి ఒకచోట ముందంజలో ఉన్నారు.

Similar News

News October 7, 2024

అడ్రస్ మార్చినా 48ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన లేఖ

image

ఉద్యోగం కోసం 1976లో దరఖాస్తు చేసిన లేఖ 48 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ఘటన UKలోని లింకన్‌షైర్‌లో జరిగింది. టిజీ హాడ్సన్ అనే 70 ఏళ్ల మహిళకు బైక్ స్టంట్ రైడర్‌ కావాలనే కల ఉండేది. దీంతో ఉద్యోగం కోసం ఆమె దరఖాస్తు చేసి ఆ లేఖను పోస్ట్ చేయగా అది పోస్టాఫీసులోని కబోర్డులో ఇరుక్కుపోయింది. తాజాగా ఆ లేఖను గుర్తించిన అధికారులు తిరిగి పంపారు. అయితే, అడ్రస్ మార్చినా లెటర్ ఎలా వచ్చిందో తెలియట్లేదని ఆమె తెలిపారు.

News October 7, 2024

సినిమా షూటింగ్.. నటుడికి గాయాలు

image

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీకి గాయాలయ్యాయి. హైదరాబాద్‌లో ‘గూఢచారి-2’ సెట్స్‌లో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయమైంది. ఒక చోటు నుంచి మరో చోటుకు దూకుతుండగా మెడకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మెడ స్వల్పంగా కట్ అయి రక్తం కారుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘OG’ తర్వాత ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న రెండో తెలుగు సినిమా ‘గూఢచారి-2’నే. ఇందులో అడివి శేష్ హీరోగా నటిస్తున్నారు.

News October 7, 2024

HK6 టోర్నీలో పాల్గొననున్న టీమ్‌ఇండియా

image

నవంబర్ 1 నుంచి జరిగే హాంగ్ కాంగ్ క్రికెట్ సిక్సెస్ టోర్నీ-2024లో భారత జట్టు పాల్గొనబోతోంది. ఈ టోర్నీకి ఇది 20వ ఎడిషన్ కాగా, గతంలో సచిన్, ధోనీ వంటి ప్లేయర్లు కూడా ఇందులో ఆడారు. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటాయి. ఇన్నింగ్స్‌కు 5 ఓవర్లు, టీమ్‌కు ఆరుగురు సభ్యులుంటారు. 3 రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పాకిస్థాన్ కూడా పాల్గొంటోంది. మన టీమ్ నుంచి ఎవరెవరు ఆడితే బాగుంటుందో కామెంట్ చేయండి.